News April 5, 2025

కంచ గచ్చిబౌలిలో 2000 ఎకరాల్లో ఎకో పార్క్‌.. నిజమేనా?

image

TG: కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల్లో అభివృద్ధి కోసం తలపెట్టిన ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి బదులు అక్కడే HCU భూమితో సహా 2000 ఎకరాలను ఎకో పార్క్‌గా మార్చనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వార్తలను HCU రిజిస్ట్రార్ దివేశ్ ఖండించారు. అలాంటి ప్లాన్ ఏదీ తమ దృష్టికి రాలేదన్నారు. వర్సిటీని తరలించేందుకు తాము ఒప్పుకోమని, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని HCU SU VP ఆకాశ్ అన్నారు.

Similar News

News January 29, 2026

రేపు ‘శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం’: భూమన

image

AP: తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని CBI ఛార్జ్‌‌షీట్లో పేర్కొనడంతో హోమం చేపట్టాలని నిర్ణయించామన్నారు. రేపు 10AMకు తిరుపతిలో ‘శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం’ చేపడతామని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని విమర్శించారు.

News January 29, 2026

₹3 కోట్లతో తీస్తే ₹30 కోట్ల వసూళ్లు.. ‘సిరాయ్’ చూశారా?

image

₹3 కోట్ల బడ్జెట్‌తో తమిళంలో తెరకెక్కిన సిరాయ్ మూవీ ₹31.58 కోట్ల వసూళ్లు సాధించింది. గతేడాది డిసెంబర్ 25న రిలీజై మేకర్లకు ఏకంగా 700% లాభాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం Z5 OTTలో సందడి చేస్తోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఖైదీని జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లే ఓ కానిస్టేబుల్ (విక్రమ్ ప్రభు) కథే సిరాయ్. మూవీలో ట్విస్టులు, ఎమోషనల్ సీన్లు కట్టిపడేస్తాయి. యథార్థ సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు.

News January 29, 2026

ఈసారి ₹3.5 లక్షల కోట్లతో బడ్జెట్!

image

AP: FY26-27కి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు భారీగా పెరగొచ్చని తెలుస్తోంది. పెద్దఎత్తున పెట్టుబడులు, భారీ ప్రాజెక్టులు వస్తుండడమే దీనికి కారణం. Fy25-26లో బడ్జెట్ ₹3,22,359.33cr కాగా ఈసారి ₹3.5 లక్షల కోట్ల వరకు అది ఉంటుందని అంచనా. దీంతో పాటు అగ్రికల్చర్ బడ్జెట్ గతంలో ₹48,341cr కాగా ఈసారి ₹60000crకు పెరుగుతుందని సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు FEB 11 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.