News September 2, 2024
ఉప్పొంగిన కృష్ణమ్మ.. ప్రజలకు అలర్ట్ మెసేజ్లు

కృష్ణానదిలో వరద పెరుగుతుండటంతో పరీవాహక ప్రాంతాల ప్రజలను హెచ్చరిస్తూ ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ అలర్ట్ మెసేజ్లు పంపుతోంది. ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం 12 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నదిలో ఈతకు వెళ్లడం, స్నానాలు చేయడం, చేపలు పట్టడం చేయొద్దని పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మెసేజ్లో పేర్కొంది.
Similar News
News January 27, 2026
NPCILలో 114 పోస్టులు.. అప్లై చేశారా?

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (<
News January 27, 2026
కొత్త బ్యాక్ డ్రాప్లో నెక్స్ట్ సినిమా: అనిల్ రావిపూడి

తాను చేయబోయే తర్వాతి సినిమా కొత్త బ్యాక్ డ్రాప్లో ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. తాను ఇంతవరకు తీయని బ్యాక్ డ్రాప్ కావడంతో ఎగ్జైట్మెంట్తో ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కథ పూర్తయ్యాక అప్డేట్స్ ఇస్తానని తెలిపారు. సినిమా మేకింగ్లో స్క్రిప్ట్ కీలకమని, అందుకే ప్రతి సీన్ విషయంలో జాగ్రత్తగా ఉంటానన్నారు. చిరంజీవితో అనిల్ తెరకెక్కించిన ‘MSVPG’ సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది.
News January 27, 2026
గ్రూప్-2 ఫలితాలకు మోక్షం ఎప్పుడో?

AP: గ్రూప్-2 నోటిఫికేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతూ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. 2023 DECలో 905 పోస్టులతో నోటిఫికేషన్ రాగా, ప్రిలిమ్స్, మెయిన్స్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయినా తుది ఫలితాలు విడుదల చేయలేదు. కోర్టు కేసులు, రోస్టర్, స్పోర్ట్స్ కోటా అంశాలు అడ్డంకులుగా మారాయి. ఇటీవల హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చినా APPSC నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా మళ్లీ కొత్త కేసులు పుట్టుకొచ్చాయి.


