News November 25, 2024

వాహనాలపై రోడ్ ట్యాక్స్ పెంపునకు కసరత్తు?

image

TG: ₹లక్ష పైన విలువున్న టూవీలర్స్, ₹10 లక్షల పైన విలువున్న కార్లకు రోడ్డు ట్యాక్స్ పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం కార్లకు 13-18%, టూవీలర్స్‌కు 9-12% ట్యాక్స్ శ్లాబులున్నాయి. గరిష్ఠంగా కేరళలో 21%, తమిళనాడులో 20% పన్ను ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆ మేరకు ఇక్కడా రేట్లు సవరించాలని నిర్ణయించారు. త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 9, 2025

టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

image

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉ.9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పూర్తి షెడ్యూల్‌ను పైన ఫొటోలో చూడవచ్చు. అనుకున్నట్టే CBSE పరీక్షల తరహాలో ఎగ్జామ్స్ మధ్య గ్యాప్ ఇచ్చారు. ఒక్కో పరీక్షకు మధ్య 4-5 రోజుల సమయం ఉంది. విద్యార్థుల ప్రిపరేషన్‌కు ఇది ఉపయోగపడనుంది.

News December 9, 2025

అన్ని రాష్ట్రాలు SIR కొనసాగించాల్సిందే: సుప్రీంకోర్టు

image

పశ్చిమ బెంగాల్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) <<18513734>>వ్యవహారంపై<<>> సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. SIR కొనసాగుతుందని స్పష్టం చేసింది. BLOలపై బెదిరింపులను తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం, బెదిరింపులను తమ దృష్టికి తేవాలని ECని ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు SIR కొనసాగించాల్సిందేనని తేల్చిచెప్పింది.

News December 9, 2025

ఈ టైమ్‌లో రీల్స్ చూస్తున్నారా? వైద్యుల సలహా ఇదే!

image

ఈమధ్య చాలామంది రీల్స్ చూస్తూ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. అనవసర రీల్స్ చూసే సమయాన్ని వ్యాయామానికి, నిద్ర కోసం కేటాయించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే ఫోన్‌లో రీల్ స్క్రోల్ చేయకుండా వ్యాయామం చేయడం ఉత్తమం అని తెలిపారు. రాత్రుళ్లు మొబైల్ నుంచి వచ్చే బ్లూలైట్ నిద్రను నియంత్రించే మెలటోనిన్‌ను అణచివేసి, నిద్ర నాణ్యతను తగ్గిస్తుందని వారు హెచ్చరించారు. share it