News November 25, 2024
వాహనాలపై రోడ్ ట్యాక్స్ పెంపునకు కసరత్తు?

TG: ₹లక్ష పైన విలువున్న టూవీలర్స్, ₹10 లక్షల పైన విలువున్న కార్లకు రోడ్డు ట్యాక్స్ పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం కార్లకు 13-18%, టూవీలర్స్కు 9-12% ట్యాక్స్ శ్లాబులున్నాయి. గరిష్ఠంగా కేరళలో 21%, తమిళనాడులో 20% పన్ను ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆ మేరకు ఇక్కడా రేట్లు సవరించాలని నిర్ణయించారు. త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 8, 2025
ఖమ్మం: తొలి విడతలోనే అతి పెద్ద పంచాయతీ పోరు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 40,761 మంది ఓటర్లు ఉన్న భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీకి డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. అతిపెద్ద పోలింగ్ కేంద్రంగా నిలిచిన ఇక్కడ సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. న్యాయపరమైన చిక్కుల తర్వాత ప్రస్తుతం ఒకే పంచాయతీగా పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్కు 5, 20 వార్డులకు 75 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో పోరు ఉత్కంఠగా మారింది.
News December 8, 2025
హోటళ్లలో ఇకపై ఆధార్ కాపీ అవసరం లేదు!

వెరిఫికేషన్ పేరుతో హోటళ్లు, ఈవెంట్ల నిర్వాహకులు కస్టమర్ల ఆధార్ కాపీలను తీసుకోకుండా UIDAI కొత్త రూల్ తీసుకురానుంది. QR కోడ్ స్కానింగ్ లేదా ఆధార్ యాప్ ద్వారా వెరిఫై చేసేలా మార్పులు చేయనుంది. ఆధార్ వెరిఫికేషన్ కోరే హోటళ్ల రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేసింది. యూజర్ల ప్రైవసీకి, డేటాకు రక్షణ కల్పించేందుకు UIDAI ఈ దిశగా అడుగులేస్తోంది. దీంతో ఓయో, ఇతర హోటళ్లలో గదులు బుక్ చేసుకునే వారికి ఉపశమనం కలగనుంది.
News December 8, 2025
డెయిరీఫామ్తో నెలకు రూ.1.25 లక్షల ఆదాయం

స్త్రీలు కూడా డెయిరీఫామ్ రంగంలో రాణిస్తారని నిరూపిస్తున్నారు హిమాచల్ప్రదేశ్లోని తుంగల్ లోయకు చెందిన సకీనా ఠాకూర్. పీజీ పూర్తి చేసిన ఈ యువతి కుటుంబం వద్దన్నా ఈ రంగంలో అడుగుపెట్టారు. తన ఫామ్లో ఉన్న 14 హెచ్ఎఫ్ ఆవుల నుంచి రోజూ 112 లీటర్ల పాలను విక్రయిస్తూ.. నెలకు రూ.1.25 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు. సకీనా సక్సెస్ వెనుక కారణాలను తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.


