News June 29, 2024

రేపటి నుంచి పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన

image

AP ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును రేపట్నుంచి 4 రోజుల పాటు అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించనుంది. కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించి పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనుంది. డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలా? కొత్తది కట్టాలా? కాఫర్ డ్యామ్‌లు, గైడ్‌బండ్‌లపై ఎలా ముందుకెళ్లాలనే విషయాలపై నిపుణుల బృందం ఏం చెబుతుందనేది ఆసక్తిగా మారింది.

Similar News

News December 9, 2025

భూసమస్యలకు ఇక JCలదే బాధ్యత: అనగాని

image

AP: జీరో ఎర్రర్ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ‘గత పాలకుల పాపాలను కడిగేందుకు కృషి చేయడంతో ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయాం. అన్ని జిల్లాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసమే జాయింట్ కలెక్టర్లు పనిచేయాలని CM స్పష్టం చేశారు. JCలు లేని జిల్లాలకు వెంటనే నియమించాలన్నారు. ఇకపై భూసమస్యలన్నింటికీ JCలదే బాధ్యత’ అని తెలిపారు.

News December 9, 2025

మరికొన్ని గంటల్లో బంద్.. నివారణకు ప్రభుత్వం చర్యలు

image

AP: అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో సరకు రవాణా లారీలు బంద్ పాటించనున్నాయి. దీన్ని ఆపేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. లారీ ఓనర్ల అసోసియేషన్ నేతలతో రవాణాశాఖ కమిషనర్ కాసేపట్లో భేటీ కానున్నారు. బంద్‌ నిర్ణయాన్ని విరమించాలని కోరనుండగా, దీనిపై నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. 13-20ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్‌నెస్ ఛార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ లారీ యజమానులు బంద్ చేయనున్నారు.

News December 9, 2025

వరల్డ్ టాప్ డిఫెన్స్ కంపెనీల జాబితాలో HAL

image

వరల్డ్ TOP-100 డిఫెన్స్ కంపెనీల జాబితాలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 44వ స్థానంలో నిలిచింది. BEL 58, మజ్గాన్ డాక్ 91 ర్యాంకుల్లో నిలిచాయని SIPRI నివేదిక పేర్కొంది. ప్రపంచ ఉద్రిక్తతలతో 2024లో జాబితాలోని 77 కంపెనీల ఆదాయం పెరిగినట్లు తెలిపింది. కాగా ఇండియా ఆయుధ విక్రయాలు 8.2% పెరిగి $7.5B ఆదాయం సమకూరింది. ఆయుధ ఆదాయంలో 49% వాటా USదే. చైనా 13%, UK 7.7%, రష్యా 4.6% ఇండియా 1.1% వాటా కలిగి ఉన్నాయి.