News May 11, 2024
బాలరాముడికి మామిడి పండ్లతో నైవేద్యం

పవిత్రమైన అక్షయ తృతీయ రోజున అయోధ్యలోని బాలరాముడికి మామిడి పండ్లను నైవేద్యంగా ఉంచారు. మామిడిపండ్లతో పాటు డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ, కివి ప్రూట్, గ్రేప్స్తో పాటు మ్యాంగో జ్యూస్ బాటిళ్లను సైతం స్వామివారికి సమర్పించారు. గుమ్మానికి కట్టిన మామిడి తోరణాలకు సైతం పండ్లను వేలాడదీయడం ఆకర్షణీయంగా ఉంది. దీంతోపాటు అస్సాంలో తయారు చేసిన ప్రత్యేక బంగారు వస్త్రాలతో రామయ్యను ముస్తాబు చేశారు.
Similar News
News November 10, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,23,220కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 ఎగబాకి రూ.1,12,950 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.2,000 పెరిగి రూ.1,67,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 10, 2025
ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

TG: కవి అందెశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ను ఆదేశించారు. అందెశ్రీ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరిగే అవకాశం ఉంది. ఆయన రచించిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రేవంత్ సర్కార్ రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
News November 10, 2025
ప్రస్థానత్రయం అంటే ఏమిటి?

హిందూ తత్వశాస్త్రంలో అత్యంత ప్రామాణిక గ్రంథాలైన ఉపనిషత్తులు(శ్రుతి ప్రస్థానం), బ్రహ్మ సూత్రాలు(న్యాయ ప్రస్థానం), భగవద్గీత (స్మృతి ప్రస్థానం).. ఈ మూడింటిని కలిపి ‘ప్రస్థానత్రయం’ అంటారు. ఇవి జ్ఞాన మార్గానికి దారులుగా పరిగణిస్తారు. ముఖ్య సిద్ధాంతాలకు ఇదే ఆధారం. ప్రతి ఆచార్యుడు తమ సిద్ధాంతాలను స్థాపించడానికి వీటిపై భాష్యం రాయడం తప్పనిసరి. ఇవి బ్రహ్మ జ్ఞానాన్ని బోధించే అత్యున్నత గ్రంథాలు. <<-se>>#VedikVibes<<>>


