News March 24, 2024
పంట నష్టంపై కొనసాగుతున్న సర్వే

TG: అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖ సర్వే ప్రారంభించింది. పంటలు దెబ్బతిన్న జిల్లాల్లో అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. నిన్న కామారెడ్డి, నిర్మల్, సిరిసిల్ల, మంచిర్యాల, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పంటలను పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి ₹10వేల చొప్పున సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News October 16, 2025
బిగ్బాస్ షోను నిలిపివేయాలని పోలీసులకు ఫిర్యాదు

TG: బిగ్బాస్ సమాజానికి, ముఖ్యంగా యువతకు తప్పుడు సందేశం ఇస్తోందని గజ్వేల్కు చెందిన యువకులు జూబ్లీహిల్స్ PSలో ఫిర్యాదు చేశారు. బిగ్బాస్ నిర్వాహకులు సమాజం సిగ్గు పడే విధంగా అభ్యంతరకరమైన కంటెంట్తో షో నిర్వహిస్తున్నారని, సమాజంలో విలువలు లేనివారిని ఎంపిక చేస్తున్నారని తెలిపారు. కర్ణాటక తరహాలో ఇక్కడా ఆ షోను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బిగ్బాస్ హౌస్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
News October 16, 2025
ముగ్గుర్నీ చూస్తుంటే కనులపండువే: పయ్యావుల

AP: కూటమికి వేసిన ఒక్క ఓటు వంద లాభాలను తెచ్చిందని కర్నూలు GST సభలో మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ‘నరేంద్రుడు, ఇంద్రుడు, తుఫాన్ లాంటి పవన్ కళ్యాణ్ను చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఇవాళ కనులపండువగా ఉంది. టారిఫ్ల పేరుతో మెడలు వంచుతామంటే స్వదేశీ నినాదంతో ప్రపంచ దేశాలను మనవైపు తిప్పేలా చేసిన నాయకత్వం మోదీది. భవిష్యత్తు తరాల తలరాతలు మార్చే నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.
News October 16, 2025
5,346 టీచర్ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఢిల్లీలో 5,346 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు DSSSB దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, పీజీ, బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులైనవారు నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100, మహిళలు, SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://dsssb.delhi.gov.in/