News April 13, 2025
అనకాపల్లి విషాదం.. ప్రధాని దిగ్భ్రాంతి

AP: అనకాపల్లి జిల్లా కోటవురట్ల(మ) కైలాసపట్నంలో పేలుడు ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ₹2లక్షలు, గాయపడ్డవారికి ₹50వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు వెల్లడించారు. కాగా AP ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ₹15లక్షల <<16086795>>సాయం <<>>ప్రకటించింది.
Similar News
News November 22, 2025
ఏపీలోనూ సర్పంచ్ ఎన్నికలు.. సన్నాహాలు షురూ!

TGలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు జరుగుతుండగా APలోనూ సన్నాహాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల జాబితాను SEC సేకరించినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారుచేయగానే నోటిఫికేషన్ విడుదలచేసే ఛాన్స్ ఉంది. కాగా APలో 2021 FEB, APRలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి.
News November 22, 2025
ఈ-రేస్ కేసులో ఏసీబీ రిపోర్ట్.. నిందితులు వీరే

TG: ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ ఫైనల్ రిపోర్టు బయటికొచ్చింది. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా బీఎల్ఎన్ రెడ్డి, A4గా కిరణ్ మల్లేశ్వరరావు, A5గా ఈ-రేస్ కంపెనీ FEO పేర్లను పొందుపరిచింది. 2024 డిసెంబర్ 19న కేసు నమోదవగా ఈ ఏడాది సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి నివేదిక పంపింది. కాగా ఈ కేసులో ఛార్జ్షీట్ నమోదుకు, కేటీఆర్ ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ గవర్నర్ ఇటీవల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే.
News November 22, 2025
‘ఫ్రీ స్కూటీ స్కీమ్’.. PIBFactCheck క్లారిటీ

‘ప్రధానమంత్రి ఫ్రీ స్కూటీ స్కీమ్’ పేరుతో SMలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాలేజీ విద్యార్థినులకు ఉచిత స్కూటీలు ఇస్తారని వైరల్ అవుతున్న పోస్టులు ఫేక్ అని PIBFactCheck తేల్చింది. ప్రజలు ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్సైట్లను మాత్రమే సందర్శించాలని పేర్కొంది.


