News April 13, 2025
అనకాపల్లి విషాదం.. ప్రధాని దిగ్భ్రాంతి

AP: అనకాపల్లి జిల్లా కోటవురట్ల(మ) కైలాసపట్నంలో పేలుడు ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ₹2లక్షలు, గాయపడ్డవారికి ₹50వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు వెల్లడించారు. కాగా AP ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ₹15లక్షల <<16086795>>సాయం <<>>ప్రకటించింది.
Similar News
News November 28, 2025
డిసెంబర్ 4న భారత్కు పుతిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన ఖరారైంది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. DEC 4, 5వ తేదీల్లో జరగనున్న 23వ ఇండియా-రష్యా వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలో పాల్గొంటారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్పై USలో అదనపు సుంకాలు విధించిన వేళ పుతిన్ రాక ప్రాధాన్యం సంతరించుకుంది.
News November 28, 2025
12 కాదు.. వచ్చే ఏడాది 13 మాసాలు ఉంటాయి!

సాధారణంగా ఏడాదికి 12 మాసాలే ఉంటాయి. అయితే 2026, MAR 30న మొదలయ్యే పరాభవ నామ సంవత్సరంలో 13 మాసాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. జ్యేష్ఠానికి ముందు అధిక జ్యేష్ఠం రావడమే దీనికి కారణం. ‘దీనిని పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. ఇది శ్రీమహా విష్ణువుకు ప్రీతిపాత్రం. అధిక మాసంలో పూజలు, దానధర్మాలు, జపాలు చేస్తే ఎంతో శ్రేష్ఠం’ అని పండితులు సూచిస్తున్నారు. SHARE IT
News November 28, 2025
మూవీ ముచ్చట్లు

* Netflixలో స్ట్రీమింగ్ అవుతున్న హీరో రవితేజ ‘మాస్ జాతర’
* రిలీజైన వారంలోనే అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసిన రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’ మూవీ
* నెట్ఫ్లిక్స్లోకి వచ్చేసిన తమిళ హీరో విష్ణు విశాల్ ‘ఆర్యన్’ చిత్రం.. తెలుగులోనూ స్ట్రీమింగ్
* బాక్సాఫీస్ వద్ద గుజరాతీ చిత్రం ‘లాలో కృష్ణా సదా సహాయతే’ రికార్డులు.. రూ.50 లక్షలతో నిర్మిస్తే 49 రోజుల్లో రూ.93 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్


