News July 4, 2024
మామెరు ఫంక్షన్లో మెరిసిన అనంత్-రాధిక

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గ్రాండ్గా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి మామెరు వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా ఈ నెల 12న వీరి వివాహం ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. 12న శుభ్ వివాహ్, 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ్ ఉత్సవ్ జరగనున్నాయి.
Similar News
News March 17, 2026
విజయనగరం RDOగా సుధాసాగర్

రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో బదిలీలు చేపట్టింది. విశాఖలోని HPCLలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (SDC-LA)గా పనిచేస్తున్న సనపాల సుధాసాగర్ను విజయనగరం RDOగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ పరీక్షల్లో అవకతవలు జరిగాయంటూ కోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. కేసు తేలేవరకు ఆ బ్యాచ్ అధికారులందరినీ బదిలీ చేయాలని న్యాయస్థానం తీర్పు మేరకు విజయనగరం RDO దాట్ల కీర్తీని బదిలీ చేసిన విషయం తెలిసిందే.
News March 17, 2026
ఇండక్షన్, ఎలక్ట్రిక్ కుక్ టాప్లను వాడుకోవాలని కేంద్రం సూచన

దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. LPGకి బదులు వీలున్నవాళ్లు ఇండక్షన్, ఎలక్ట్రిక్ కుక్ టాప్లను వాడుకోవాలని తెలిపింది. ఇలా ప్రభుత్వం ఇండక్షన్ స్టవ్లను వాడమని సూచించడం ఇదే తొలిసారి. అలాగే PNGకి మారే అవకాశాన్నీ పరిశీలించాలని కోరింది. ఇలా వీలైన చోట గ్యాస్ను పొదుపు చేయడం కోసం ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవాలంది. ఎట్టిపరిస్థితుల్లో పానిక్ బుకింగ్ చేయొద్దని కోరింది.
News March 17, 2026
‘లంచ్ బాక్స్ తెచ్చుకోండి’.. IT ఉద్యోగులకు గ్యాస్ కష్టాలు

దేశంలో నెలకొన్న LPG కొరత IT ఉద్యోగులను కష్టాలకు గురిచేస్తోంది. ఇన్ఫోసిస్, TCS, విప్రో, కాగ్నిజెంట్ వంటి సంస్థలు తమ క్యాంటీన్ సేవలను తగ్గించాయి. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఫుడ్ కౌంటర్లను మూసివేసి కేవలం లిమిటెడ్ మెనూని మాత్రమే అందిస్తున్నాయి. ఉద్యోగులు తమ భోజనాన్ని ఇళ్ల నుంచే తెచ్చుకోవాలని కంపెనీలు సూచించాయి. హాస్టళ్లు, PGల్లో ఉంటూ క్యాంటీన్ ఫుడ్పై ఆధారపడే టెకీలకు ఇది పెద్ద సమస్యగా మారింది.


