News September 4, 2024
రూ.5 లక్షలు విరాళమిచ్చిన అనన్య నాగళ్ల

తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం యువ నటి అనన్య నాగళ్ల రూ.5 లక్షల విరాళం ఇచ్చారు. ఏపీ, తెలంగాణ సీఎంల సహాయనిధికి చెరో రూ.2.50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. డైరెక్టర్ వెంకీ అట్లూరి రెండు రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున విరాళాన్ని అందజేశారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, బాలకృష్ణ, సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్సేన్, డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ విరాళాలు ఇచ్చారు.
Similar News
News February 6, 2026
పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 5,138 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News February 6, 2026
గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!

దేశంలో ఉద్యోగ మార్కెట్ క్రమంగా కోలుకుంటుండటంతో జీతాల్లో పెంపు ప్రారంభమైందని మైఖేల్ పేజ్ ఇండియా వెల్లడించింది. ఈ ఏడాది అన్ని రంగాల్లో జీతాల పెంపు సగటున 8 నుంచి 12 శాతం వరకు ఉండొచ్చని ‘ది శాలరీ గైడ్-2026’ నివేదికలో తెలిపింది. కొత్త స్కిల్స్ ఉన్నవారు ఉద్యోగాలు మారితే కంపెనీలు 30 శాతం వరకు అధిక జీతాలు ఆఫర్ చేస్తున్నాయని పేర్కొంది. CFO, CTO, ఇంజినీరింగ్ హెడ్స్కు డిమాండ్ పెరిగిందని తెలిపింది.
News February 6, 2026
ఆఫీస్ స్పేస్కు పెరుగుతున్న డిమాండ్

TG: హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం చివరికి కొత్తగా దాదాపు 19 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుందని ఇక్రా నివేదిక తెలిపింది. వీటిలో పావు వంతు వాటికి ఇప్పటికే లీజ్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించింది. IT, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల నుంచి డిమాండ్ ఉంది. లీజు ధరలు ఏడాదికి 3-4% పెరుగుతూ వస్తున్నాయి.


