News March 17, 2024

ఇక పురుషుల వంతు..

image

ఆర్సీబీ మహిళల జట్టు WPL సీజన్-2లో టైటిల్ గెలవడంతో పురుషుల జట్టుపై ఫ్యాన్స్‌కు ఆశలు పెరిగాయి. కొన్నేళ్లుగా ఐపీఎల్ ఆరంభం నుంచి వినిపించే ‘ఈ సాలా కప్ నమ్దే’ ఈసారి నిజమవుతుందటూ ఆర్సీబీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. 2008 నుంచి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో ట్రోఫీని ముద్దాడుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మార్చి 22న జరిగే ఐపీఎల్‌-2024 సీజన్‌ ఆరంభ పోరులో CSKతో ఆర్సీబీ తలపడనుంది.

Similar News

News September 9, 2025

ఆ కంపెనీలపై ట్రంప్ పన్ను పోటు!

image

అమెరికాలో విదేశీ వర్కర్లను నియమించుకునే కంపెనీలపై 25 శాతం అదనంగా పన్నులు విధించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పన్నులు ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత అమలు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో ఈ విధానం తీసుకొస్తున్నట్లు సమాచారం.

News September 9, 2025

డొనాల్డ్ ట్రంప్ మనవరాలిని చూశారా?

image

యూఎస్ ఓపెన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ సందడి చేసింది. ఈ ఈవెంట్‌కు ట్రంప్‌తో పాటు ఇవాంకా భర్త జారెడ్ కుష్నర్, వారి కుమార్తె అరబెల్లా రోజ్ కుష్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ మీడియా కళ్లన్నీ 13 ఏళ్ల అరబెల్లానే ఫోకస్ చేయడంతో ఆమె హైలైట్ అయ్యారు. తన తాత ట్రంప్‌తో ముచ్చటిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

News September 9, 2025

ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఎంపీలతో లోకేశ్ భేటీ

image

AP: ఉపరాష్ట్రపతి ఓటింగ్ ప్రక్రియపై మంత్రి నారా లోకేశ్ టీడీపీ ఎంపీలకు పలు సూచనలు చేశారు. రేపు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లారు. అక్కడ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించారు. కాగా టీడీపీకి లోక్‌సభలో 16, రాజ్యసభలో ఇద్దరు ఎంపీల బలం ఉంది.