News June 4, 2024
TDP MLAగా గెలిచిన అంగన్వాడీ టీచర్

AP: అల్లూరి జిల్లా రంపచోడవరంలో టీడీపీ అభ్యర్థి మిర్యాల శిరీషాదేవి విజయం రాష్ట్రంలోనే ఆసక్తిగా నిలిచింది. వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మిపై 9,139 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన శిరీష 15 ఏళ్ల తర్వాత ఇక్కడ టీడీపీ జెండాను రెపరెపలాడించారు. గతంలో అంగన్వాడీ టీచర్గా ఆమె.. ఇప్పుడు MLAగా అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు.
Similar News
News November 4, 2025
RITESలో 600 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES)లో 600 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీఎస్సీ, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC,ST, PWBDలకు రూ.100. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. *ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News November 4, 2025
వాము పంట సాగు- అనువైన రకాలు

వాము పంటను ఏ నేలలోనైనా, ఏ వాతావరణంలోనైనా సాగు చేయవచ్చు. నల్లరేగడి నేలలో బాగా పండుతుంది. గుంటూరు లామ్ విడుదల చేసిన L.S-1, LTA-26, లామ్ వర్షా రకాలు మంచి దిగుబడినిస్తాయి. వాము పంటకాలం 150-160 రోజులు. వీటిలో లామ్ వర్షా బెట్ట పరిస్థితులను తట్టుకొని ఎకరాకు 4-5 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. వాము పంట అధిక తేమ, నీటి ముంపును తట్టుకోలేదు. లోతట్టు నేలలు వాము సాగుకు అనుకూలం కాదు. మురుగునీటి వసతి ఉండాలి.
News November 4, 2025
నష్టాలను పూడ్చే గరిక నీటి అభిషేకం

వినాయకుడికి గరిక ఎంతో ప్రీతిపాత్రమైనది. అలాంటి గరిక కలిపిన నీటితో శివ లింగానికి అభిషేకం చేస్తే విశేష ఫలితాలు దక్కుతాయని పండితులు చెబుతున్నారు. గరిక నీటితో శివుడికి అభిషేకం చేయడం వల్ల నష్టపోయినదంతా తిరిగి పొందుతారని అంటున్నారు. ‘ఈ అభిషేకానికి కోల్పోయిన గౌరవాన్ని తిరిగి సంపాదించుకునే శక్తి కూడా ఉంటుది. జీవితంలో ఎదురైన ఆటంకాల నుంచి బయటపడి, పూర్వ వైభవం పొందడానికి ఈ అభిషేకం ఉత్తమం’ అని సూచిస్తున్నారు.


