News September 7, 2024
ఈవీ మార్కెట్లోకి అనిల్ అంబానీ?

అప్పుల ఊబిలో చిక్కుకున్న అనిల్ అంబానీ నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. రాయిటర్స్ కథనం ప్రకారం.. విద్యుత్ వాహనాల పరిశ్రమలోకి ఆయన అడుగుపెట్టనున్నారు. విద్యుత్ కార్లు, బ్యాటరీల ఉత్పత్తి కోసం చైనా కంపెనీ BYD మాజీ ఎగ్జిక్యూటివ్ సంజయ్ గోపాలకృష్ణన్ను సలహాదారుగా నియమించుకున్నారు. ఏడాదికి 2.5లక్షల వాహనాలు ఉత్పత్తి చేసే ప్లాంట్ను నిర్మించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 17, 2025
BELలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 17, 2025
చరిత్రాత్మక ఘట్టం.. పార్టీకో పేరు!

TG: నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్ 1948, SEP 17న భారత సమాఖ్యలో విలీనమైంది. ఈ చరిత్రాత్మక రోజును ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో నిర్వహిస్తోంది. గత BRS ప్రభుత్వం ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ అని, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ‘ప్రజా పాలన దినోత్సవం’ అని పేర్లు పెట్టాయి. అటు BJP నేతృత్వంలోని కేంద్రం ఐదేళ్లుగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ పేరిట వేడుకలు నిర్వహిస్తోంది. పేరేదైనా.. ఉద్దేశం అమరులను స్మరించుకోవడమే.
News September 17, 2025
మహిళల ఆరోగ్యం కోసం కొత్త కార్యక్రమం

నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా మహిళల ఆరోగ్యం కోసం కేంద్రం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ పేరిట హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 2 వరకు మహిళలకు పలు వైద్య పరీక్షలు చేస్తారు. PHC మొదలు బోధనా ఆస్పత్రుల వరకు 15 రోజులపాటు ఈ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ నేడు మధ్యప్రదేశ్లో ప్రారంభించనున్నారు.