News June 16, 2024

ఎన్టీఆర్ మూవీలో ‘యానిమల్’ విలన్?

image

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కే మూవీలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని శక్తిమంతమైన విలన్ పాత్ర కోసం ఆయనను ప్రశాంత్ నీల్ కలిసినట్లు టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం NTR దేవర, వార్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ ‘సలార్’ పార్ట్-2 తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇవి పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని సమాచారం.

Similar News

News November 5, 2025

మరో 4 కొత్త రెవెన్యూ డివిజన్లు?

image

AP: నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే రెవెన్యూ డివిజన్లను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర కేంద్రాలుగా కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మరోవైపు కైకలూరు సెగ్మెంట్‌ను కృష్ణా జిల్లాలో, గన్నవరం, నూజివీడులను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే ప్రతిపాదనలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది. ఇవాళ వీటిపై చర్చించి ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది.

News November 5, 2025

పశువుల్లో రేబీస్ వ్యాధిని ఎలా గుర్తించాలి?

image

రేబీస్ వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వస్తుంది. తర్వాత కేంద్రనాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల పశువులు అసాధారణంగా ప్రవర్తిస్తాయి. కండరాలలోని నరాలు దెబ్బతినడం వల్ల పక్షవాతం సోకుతుంది. మేతను మింగలేకపోవడం, నీటిని చూసి భయపడటం, అధిక లాలాజలం స్రవించడం, బలహీనత, ఎక్కువగా అరవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువులను కుక్క కరిస్తే సాధ్యమైనంత త్వరగా వెటర్నరీ డాక్టరు సూచనలతో యాంటీరేబీస్ టీకా వేయించాలి.

News November 5, 2025

కార్తీక మాసం: ఉసిరి దీపం ఎందుకు పెడతారు?

image

ఉసిరి చెట్టు అంటే శివస్వరూపం. అందుకే కార్తీకంలో దానికి పూజలు చేస్తారు. దీని కింద దీపం పెడితే సకల కష్టాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయని శివ పురాణం చెబుతోంది. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి దీపం పెడితే విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఉసిరికాయ లక్ష్మీదేవి ప్రతిరూపం కాబట్టి.. ఈ దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవీ ఆర్థిక బాధలన్నీ తొలగిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం శుభప్రదం.