News November 30, 2024

ఆంజనేయ స్వామి సాక్షిగా చెబుతున్నా.. ఖబడ్దార్: CBN

image

AP: సమాజహితం కోసం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని నేమకల్లు సభలో సీఎం చంద్రబాబు తెలిపారు. ‘ఎక్కడికక్కడ డ్రోన్లు ఏర్పాటు చేశాం. ఈ మిషన్‌కి ఈగల్ అని పేరు పెట్టా. రాష్ట్రం మొత్తం డేగకన్నుతో వాచ్ చేస్తున్నాం. ఎవడైనా గంజాయి పండించినా, అమ్మినా అదే మీకు చివరిరోజు అవుతుంది. ఆంజనేయ స్వామి సాక్షిగా చెబుతున్నా.. ఖబడ్దార్’ అని సీఎం వార్నింగ్ ఇచ్చారు.

Similar News

News January 8, 2026

వేద పారాయణారుల మార్కుల పరిశీలన పూర్తి

image

టీటీడీ 700 మంది వేద పారాయణదారుల నియామకం కోసం గతనెల ఇంటర్వూలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వివిధ వేదాలు వేద పండితులు మార్కులను టీటీడీ నియమించిన స్క్రీనింగ్ కమిటీ పరిశీలన పూర్తి చేసినట్లు తెలుస్తోంది. త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

News January 8, 2026

అసెంబ్లీకి రాని వైసీపీ MLAలకు నోటీసులు!

image

AP: అసెంబ్లీకి హాజరుకాకుండా జీతాలు తీసుకుంటున్న YCP MLAలపై ఎథిక్స్ కమిటీ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ అంశంపై సమావేశమైన కమిటీ సభ్యులు సభకు రాకపోయినా జీతాలు, టీఏ, డీఏలు తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందుగా వారికి నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని నిర్ణయించింది. నిపుణుల అభిప్రాయాలు, ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని కమిటీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు.

News January 8, 2026

వామ్మో.. నాటుకోడి కేజీ రూ.2,500

image

AP: సంక్రాంతి పండుగ నేపథ్యంలో నాటుకోళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గ్రామ దేవతలకు మొక్కులు తీర్చడంతోపాటు అతిథులకు నాటుకోడి వంటకాలు పెట్టడం ఆనవాయితీ. దీంతో కేజీ కోడి ధర రూ.2,000-2,500(గతంలో రూ.1,000-1,200) పలుకుతోంది. వైరస్‌ల కారణంగా నాటుకోళ్లను పెంచే వారి సంఖ్య తగ్గిపోవడంతో కొరత ఏర్పడింది. ఇదే అదునుగా యజమానులు రేట్లు భారీగా పెంచేశారు. అటు బ్రాయిలర్ చికెన్ రేటు కూడా రూ.300-350 పలుకుతోంది.