News August 15, 2024
అన్న క్యాంటీన్లను పైసా వసూల్ క్యాంటీన్లుగా మార్చేశారు: వైసీపీ

AP: అన్న క్యాంటీన్లను CM చంద్రబాబు పైసా వసూల్ క్యాంటీన్లుగా మార్చేశారని YCP విమర్శించింది. ‘అన్న క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ ఇన్నాళ్లు డబ్బాకొట్టారు. వాటికి TDP రంగులు వేసి ఆర్భాటం చేశారు. కానీ ఇప్పుడు ప్రజల నుంచి చందాలు సేకరిస్తున్నారు. ప్రజలు డబ్బులు ఇవ్వాలి.. కానీ క్రెడిట్ మాత్రం ఆయనకే కావాలి’ అని ట్వీట్ చేసింది. అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని దాతలను CM కోరిన సంగతి తెలిసిందే.
Similar News
News January 2, 2026
శనగపిండితో చర్మానికి ఎన్నో లాభాలు

శనగపిండిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంపై జిడ్డు, మొటిమలను తగ్గించి చర్మ రంధ్రాలను శుభ్రపరచడంలో సాయపడతాయంటున్నారు నిపుణులు. ఇది చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మార్చే క్లెన్సర్గానూ పనిచేస్తుంది. ముడతలు తగ్గించి, చర్మాన్ని బిగుతుగా మార్చేస్తుంది. దీనికి గంధం, పాలు, ముల్తానీ మట్టి, కాఫీ పొడి, నిమ్మరసం, పెరుగు, తేనె, పసుపు వంటివి కలిపి రాస్తే అదనపు ప్రయోజనాలుంటాయి.
News January 2, 2026
BRSకు కవిత డెత్ వార్నింగ్!

తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్లో కవిత BRSకు డెత్ వార్నింగ్ ఇచ్చారు. KCR రాకపోతే BRSను భగవంతుడు కూడా కాపాడలేడన్నారు. KCR అసెంబ్లీలో మాట్లాడాలని పార్టీలు, ప్రజలు కోరుతున్న వేళ కూతురూ ఇదే మాట అని పుట్టింటి పార్టీని ఓ విధంగా ఇరకాటంలో పెట్టారు. గులాబీ బాస్పై కాంగ్రెస్ ఆరోపణలపై మండిపడుతూనే KCR లేకపోతే పార్టీ కథ ముగిసినట్లే అని పరోక్షంగా హెచ్చరించారు. కవిత కామెంట్లతో మీరు ఏకీభవిస్తారా? కామెంట్ చేయండి.
News January 2, 2026
IIIT పుణేలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<


