News August 15, 2024
అన్నక్యాంటీన్లు: ఆస్పత్రుల దగ్గర పెడితే..

AP: అన్నక్యాంటీన్లలో రూ.15కే కడుపు నింపుకోవచ్చు. తొలి విడతలో ప్రభుత్వం 100 క్యాంటీన్లను ప్రారంభించింది. అయితే ఆస్పత్రుల వద్ద వీటిని ఏర్పాటు చేస్తే చాలా మందికి ప్రయోజనం కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రోగిని చూసుకునే అటెండెంట్ బయట హోటల్లో ఒక్కపూట భోజనం చేయాలంటే కనీసం రూ.50 నుంచి రూ.80 ఖర్చవుతోంది. వీటి ఏర్పాటుతో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ రూ.15తో చేయొచ్చు. మీరేమంటారు?
Similar News
News November 10, 2025
APEDAలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

APEDAలో 11 బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, అసోసియేట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BSc, MSc (అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, ప్లాంటేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫారెన్ ట్రేడ్, పబ్లిక్ పాలసీ, ఫుడ్ సైన్స్/ కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ), PGDM, MBAతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://apeda.gov.in/
News November 10, 2025
రూ.5,200 కోట్లతో విశాఖలో లారస్ ల్యాబ్స్

AP: ప్రముఖ డ్రగ్ కంపెనీ లారస్ ల్యాబ్స్ విశాఖలో దాదాపు రూ.5,200 కోట్లతో అత్యాధునిక మాన్యుఫాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటుచేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం 532 ఎకరాలను కేటాయించిందని సంస్థ ఫౌండర్ చావా సత్యనారాయణ తెలిపారు. ఔషధ కంపెనీల్లో కీలకమైన ఫర్మంటేషన్ ప్లాంట్నూ ఇక్కడే ఏర్పాటుచేస్తామన్నారు. ప్రస్తుతం ఏటా రూ.వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని పెట్టుబడులు పెడతామని పేర్కొన్నారు.
News November 10, 2025
సాహితీ శిఖరం నేలకొరిగింది: సీఎం రేవంత్

TG: అందెశ్రీ మరణంపై CM రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ శిఖరం నేలకొరిగిందన్నారు. రాష్ట్ర సాధనలో అందెశ్రీ కోట్లాది ప్రజల గొంతుకై నిలిచారని కొనియాడారు. ఆయన రాసిన జయజయహే తెలంగాణను ప్రజా ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించిందని గుర్తు చేసుకున్నారు. TPCC చీఫ్ మహేశ్ కుమార్, రాష్ట్ర మంత్రులు కూడా అందెశ్రీ మరణానికి సంతాపం తెలిపారు.


