News April 11, 2025

జాతీయ స్థాయిలో అన్నామలై సేవలు: అమిత్‌షా

image

తమిళనాడు బీజేపీ చీఫ్ పదవి కోసం ఒకే నామినేషన్ దాఖలైనట్లు కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. అన్నామలై సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామని తెలిపారు. ప్రధాని మోదీ విధానాలను గ్రామీణ స్థాయిలో తీసుకెళ్లడంలో అన్నామలై భాగస్వామ్యం విలువైనవని పేర్కొన్నారు. కాగా ఒకే నామినేషన్ దాఖలు కావడంతో రేపు నైనార్ నాగేంద్రన్‌‌ను అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశముంది.

Similar News

News February 7, 2026

APRకి అమరావతిలో క్వాంటం కంప్యూటర్లు: చంద్రబాబు

image

AP: ఈ నెల 16న అమరావతికి బిల్ గేట్స్ రానున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘APR 14 నుంచి 2 క్వాంటం కంప్యూటర్లు అమరావతిలో ఆపరేట్ అవుతాయి. అమరావతిలో క్వాంటం టాలెంట్ హబ్ రెడీ అవుతోంది. దాని ద్వారా ఐదేళ్లలో 35లక్షల మంది విద్యార్థులు ట్రైన్ అవుతారు. తిరుపతిని స్పేస్ సిటీగా మార్చేందుకు సహకరించాలని ఇప్పుడే కేంద్రాన్ని కోరాను. వచ్చే 40ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేపట్టాం’ అని తెలిపారు.

News February 7, 2026

ప్రీ డయాబెటీస్‌ని ఎలా గుర్తించాలంటే?

image

ప్రీ డ‌యాబెటిస్ అంటే డ‌యాబెటిస్‌కి ముందు స్టేజి. వీరిలో ర‌క్తంలో చక్కెర స్థాయిలు మ‌రీ అధికంగా ఉండ‌వు కానీ కాస్త ఎక్కువ‌గా ఉంటాయి. దీన్ని ప‌ట్టించుకోక‌పోతే డ‌యాబెటిస్ స్టేజిలోకి వెళ్తారు. వీరికి సాధార‌ణంగా వైద్యులు మందుల‌ను ఇవ్వ‌రు. కొన్నిరోజుల పాటు డైట్, వ్యాయామం చేయాల‌ని సూచిస్తారు. ప్రీ డయాబెటీస్ ఉన్న కొందరికి షుగర్ లక్షణాలుంటాయి. కానీ 35 ఏళ్లు దాటాక అందరూ షుగర్ టెస్టులు చేయించుకోవడం మంచిది.

News February 7, 2026

FEB 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం

image

TG: మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ రోజైన ఫిబ్రవరి 11న స్థానిక సెలవు ప్రకటించాలని SEC జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఆ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని తెలిపింది. ప్రైవేట్ పరిశ్రమలకూ సెలవు ఇవ్వాలని సూచించారు. ఓటర్లు ఎటువంటి ఆటంకం లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సెలవు ప్రకటిస్తున్నట్లు SEC వెల్లడించింది.