News March 18, 2024
అన్నమయ్య: గుండెపోటుతో ఏఎస్ఐ మృతి

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఎం.రెడ్డెప్పనాయక్ ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. పీటీఎం మండలం చండ్రాయునిపల్లి సరిహద్దు చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తుండగా గుండె నొప్పి వచ్చింది. వెంటనే సహచరులు ఏఎస్ఐని 108లో బి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు మార్గమధ్యలోనే చనిపోయినట్లు నిర్ధారించారు. ఆయన మృతిపై పలువురు సంతాపం తెలిపారు.
Similar News
News April 7, 2026
ఎర్రగుంట్ల RTPPలో 8,323.926 MU విద్యుత్ ఉత్పత్తి.!

కడప జిల్లాలోని ప్రభుత్వ రంగంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (RTPP)లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో 8,323.926 MU విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఇక్కడ 5X210MW, 1X600MW విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి. యూనిట్ల వారీగా విద్యుత్ ఉత్పత్తి వివరాలు(MUలో).
☛ U1 – 1062.648
☛ U2 – 1010.066
☛ U3 – 1080.999
☛ U4 – 972.7590
☛ U5 – 1016.253
☛ U6 – 3181.201MU విద్యుత్ ఉత్పత్తి జరిగింది.
News April 6, 2026
నీటి భద్రత అందరి బాధ్యత: కలెక్టర్ శ్రీధర్

జలధార కార్యక్రమంలో భాగంగా కడపలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సోమవారం 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు అమలయ్యే ఈ ప్లాన్ ద్వారా నీటి భద్రత, సాగునీటి పొదుపు, డ్రిప్ సాగు, వర్షపు నీటిని ఒడిసిపట్టడం వంటి అంశాలను పటిష్టం చేయాలన్నారు. నీటి సంరక్షణ మనందరి సమిష్టి బాధ్యత అని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
News April 6, 2026
కడప జిల్లా పోలీస్ PGRSకు 114 ఫిర్యాదులు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నచికేత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు సోమవారం 114 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదు దారులతో ఆయన స్వయంగా మాట్లాడి పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. చట్ట పరిధిలో బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎవరైనా తమ సమస్యలను విన్నవించుకోవచ్చని చట్ట పరిధిలో వారికి న్యాయం చేస్తామని తెలిపారు.


