News March 28, 2025

47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన

image

AP: రాష్ట్రంలో మూడో విడత నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్‌లను ప్రకటించింది. ఇందులో 37 టీడీపీకి, 8 జనసేనకు, రెండు బీజేపీకి దక్కాయి. ఆ కమిటీల్లో 705 మంది సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. త్వరలోనే మిగిలిన పదవులను భర్తీ చేస్తామని కూటమి అగ్ర నేతలు చెబుతున్నారు.

Similar News

News January 9, 2026

97% మందికి వైకుంఠ ద్వార దర్శనం: CM CBN

image

AP: తిరుమల పవిత్రతను కాపాడేేందుకు భక్తుల సహకారం అవసరమని CM CBN అన్నారు. వైకుంఠ ఏకాదశిని అద్భుతంగా నిర్వహించిన TTDని అభినందించారు. DEC 30-JAN 8 వరకు 7.83 లక్షల మందికి వేంకటేశ్వరుడి దర్శన భాగ్యం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. 97% మంది సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం అభినందనీయమన్నారు. క్యూలైన్లు, ప్రసాదం పంపిణీ నుంచి అమలు చేసిన అన్ని విధానాలు సత్ఫలితాలనిచ్చాయన్నారు.

News January 9, 2026

అద్దె బస్సులు.. సమ్మె రద్దు

image

AP: ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు <<18795223>>సమ్మె<<>> రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 12 నుంచి సమ్మె తలపెట్టగా ప్రభుత్వ జోక్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘాల నాయకులు వెల్లడించారు. 5 ప్రధాన సమస్యలను ఆర్టీసీ ఎండీకి వివరించినట్లు పేర్కొన్నారు. దీంతో సంక్రాంతి వేళ ప్రయాణికులకు ప్రయాణకష్టాలు తప్పినట్లే.

News January 9, 2026

పాకిస్థాన్ క్రికెట్ లీగ్‌లో హైదరాబాద్ టీమ్!

image

పాక్ క్రికెట్ బోర్డు నిర్వహించే PSLలో 2కొత్త టీమ్స్ చేరాయి. సియాల్‌కోట్ ఫ్రాంచైజీని OG డెవలపర్స్ ₹58.38 కోట్లకు, హైదరాబాద్ ఫ్రాంచైజీని ₹55.57 కోట్లకు FKS గ్రూప్ దక్కించుకున్నాయి. పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హైదరాబాద్ పేరుతో సిటీ ఉంది. హైదరాబాద్ ఫ్రాంచైజీ విలువ శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ శాలరీ (₹26.75Cr+27Cr)తో దాదాపు సమానం కావడం గమనార్హం. మొత్తం 8 టీమ్స్‌తో మార్చి 26 నుంచి PSL ప్రారంభం కానుంది.