News March 21, 2024

హోలీలోపే అభ్యర్థుల ప్రకటన: రేవంత్

image

TG: హోలీ పండగలోపు కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మల్కాజిగిరి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను సీఎంగా ఉన్నానంటే.. ఆ గొప్పతనం మల్కాజిగిరి కార్యకర్తలదేనన్నారు. ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మల్కాజిగిరి క్యాంపెయిన్ మోడల్ రాష్ట్రమంతా అనుసరించేలా చేయాలని సూచించారు.

Similar News

News October 1, 2024

పాస్‌పోర్టుల రంగులకు అర్థం ఇదే

image

సాధారణంగా పాస్‌పోర్టు నీలం రంగులో ఉంటుందన్న సంగతి తెలిసిందే. పౌరులందరికీ ప్రభుత్వం జారీ చేసే పాస్‌పోర్టులు ఈ రంగులో ఉంటాయి. ఇది కాక మరో 3 రంగులున్నాయి. ఒకటి ఆరెంజ్ కలర్ కాగా మిగతావి తెలుపు, మెరూన్ రంగులు. పదోక్లాస్ పూర్తి చేయని వారికి ఆరెంజ్, దౌత్యవేత్తలకు మెరూన్, భారత ప్రభుత్వ పని మీద విదేశాలకు వెళ్లే అధికారులకు తెలుపు రంగులో పాస్‌పోర్టుల్ని కేంద్రం జారీ చేస్తుంది.

News October 1, 2024

అదే గనుక జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవు.. ఇరాన్‌ను హెచ్చరించిన అమెరికా

image

ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి ఇరాన్ సిద్ధమవుతున్నట్లు స‌మాచారం ఉంద‌ని అమెరికా తెలిపింది. అదే గ‌నుక జ‌రిగితే టెహ్రాన్ తీవ్ర ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించింది. న‌స్ర‌ల్లాను హ‌త‌మార్చిన అనంత‌రం లెబ‌నాన్‌లో ఇజ్రాయెల్‌ గ్రౌండ్ ఆప‌రేష‌న్స్ చేపట్టింది. ఈ నేప‌థ్యంలో ఇరాన్ దాడి స‌మాచారంపై ఇజ్రాయెల్ ర‌క్ష‌ణాత్మ‌క వ్యూహాల‌కు పూర్తి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు అమెరికా ప్ర‌క‌టించింది.

News October 1, 2024

10 ఉమ్మడి జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లు

image

తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలకు సీనియర్ ఐఏఎస్‌లను స్పెషల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం నియమించింది. ఆదిలాబాద్- ఇలంబరితి, కరీంనగర్- ఆర్‌వీ కర్ణన్, నల్గొండ- అనిత రామచంద్రన్, నిజామాబాద్- ఎ.శరత్, రంగారెడ్డి- డి.దివ్య, మహబూబ్‌నగర్- రవి, వరంగల్- టి.వి.కృష్ణారెడ్డి, మెదక్-దాసరి హరిచందన, ఖమ్మం- కె.సురేంద్రమోహన్, హైదరాబాద్-ఆమ్రపాలిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.