News March 21, 2024
నేడు ఆ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!

TG: కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై ఇంకా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించగా, ఇవాళ మరో ఆరుగురు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇందులో పెద్దపల్లి, చేవెళ్ల, సికింద్రాబాద్, ఆదిలాబాద్, మల్కాజిగిరి, నాగర్కర్నూల్ ఉన్నాయి. ఖమ్మం, WGL, కరీంనగర్, NZB, భువనగిరి, మెదక్, HYD అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. వీటిపై మరో 2 రోజుల్లో స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News December 6, 2025
విమాన ఛార్జీల పెంపుపై కేంద్రం కఠిన చర్యలు

ఇండిగో సంక్షోభాన్ని ఆసరాగా తీసుకుని ఇతర విమానయాన సంస్థలు అడ్డగోలుగా టికెట్ ధరలు పెంచడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఛార్జీల క్రమబద్ధీకరణకు ఆదేశాలు జారీ చేసింది. సర్వీసులు రద్దైన అన్ని రూట్లలో కొత్తగా నిర్ణయించిన ధరలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని.. ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని పేర్కొంది.
News December 6, 2025
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్

AP: ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 2 నుంచి 13 వరకు 9AM నుంచి 12PM వరకు ఇంటర్ పరీక్షలు, ఏప్రిల్ 11 నుంచి 18 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. అలాగే టెన్త్ ఎగ్జామ్స్ మార్చి 16 నుంచి 28 వరకు 9.30AM నుంచి 12.30PM వరకు జరుగుతాయి.
వెబ్సైట్: https://apopenschool.ap.gov.in/
News December 6, 2025
సేంద్రియ ఎరువులు.. సాగులో వాటి ప్రాధాన్యత

పంటలు, మొక్కలు ఏపుగా పెరగాలంటే ఎరువులు అవసరం. ఇవి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందించి మంచి దిగుబడిని అందిస్తాయి. రసాయన ఎరువులతో కొన్ని దుష్పరిణామాలు ఉన్నందున ప్రస్తుతం చాలా మంది రైతులు సేంద్రియ ఎరువులను వాడుతున్నారు. ఈ ఎరువులను మొక్కలు, జంతువుల వ్యర్థాలు, విసర్జితాల నుంచి తయారుచేస్తారు. సమగ్ర ఎరువుల వాడకంలో సేంద్రియ ఎరువులు ఒక భాగం. రైతులు వీటిని వ్యవసాయంలో తప్పక వాడితే సాగు వ్యయం తగ్గుతుంది.


