News January 2, 2025
రాజ్యాంగ మార్పు ప్రకటనలు మానుకోవాలి: అసదుద్దీన్

కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించాలని MIM అధినేత అసదుద్దీన్ కోరారు. రాజ్యాంగాన్ని మారుస్తామంటూ చేస్తున్న ప్రకటనల్ని మానుకోవాలని అవి ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ‘రాజ్యాంగంలో మార్పులు తెస్తే ప్రతిపక్షాల ఆమోదం కచ్చితంగా ఉండాలి. ప్రార్థనా స్థలాల్ని మార్చడాన్ని 1991 చట్టం ఒప్పుకోదు. స్వాతంత్ర్యం తర్వాతి నుంచి ఉన్న ఏ ప్రార్థనా స్థలమైనా యథాతథంగా కొనసాగాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News October 28, 2025
రైతులకు కేంద్రం శుభవార్త

దేశంలోని రైతులను ఆదుకొనేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫెర్టిలైజర్ సబ్సిడీకి ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీంతో రైతులకు ₹3వేల కోట్లమేర లబ్ధి చేకూరనుంది. PM అధ్యక్షతన జరుగుతున్న కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఫెర్టిలైజర్ సబ్సిడీ అంశంపై చర్చించి ఆమోదించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో పాటు ఇతర మరికొన్ని సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలపైనా మధ్యాహ్నం 3కి మీడియాకు వెల్లడిస్తారు.
News October 28, 2025
వాట్సాప్ నుంచి గ్యాస్ బుక్ చేయొచ్చు!

LPG సిలిండర్ను వాట్సాప్లోనూ బుక్ చేసుకోవచ్చు. భారత్ గ్యాస్, Indane, HP గ్యాస్ కస్టమర్లు తమ రిజిస్టర్డ్ నంబర్ నుంచి కంపెనీ అధికారిక వాట్సాప్ నంబర్కు “Hi” లేదా “REFILL” అని మెసేజ్ చేస్తే చాలు. ఈ 24×7 సేవ ద్వారా తక్షణ బుకింగ్ కన్ఫర్మేషన్, డెలివరీ ట్రాకింగ్, చెల్లింపు సౌకర్యాలు లభిస్తాయి. Bharat- 1800 22 4344, Indane- 75888 88824, HP Gas -92222 01122 నంబర్లకు వాట్సాప్ చేయొచ్చు. SHARE IT
News October 28, 2025
బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?

బొట్టు పెట్టుకోవడం అలంకరణ మాత్రమే కాదు. దీని వెనుక శాస్త్రీయ కారణాలున్నాయి. కనుబొమ్మల నడుమ ఖాళీ స్థలాన్ని ఆజ్ఞ చక్రం అంటారు. ఇది శరీరంలో ముఖ్యమైన నాడీ కేంద్రం. ఇక్కడ తిలకం దిద్దితే ఆజ్ఞ చక్రం ఉత్తేజితమై ముఖ కండరాల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మనసును శాంతంగా ఉంచి, సానుకూల శక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది.
☞ రోజూ ఆధ్యాత్మిక సమాచారం, ధర్మసందేహాల నివృత్తి కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


