News April 19, 2024

మరో 25 ఏళ్లు వైసీపీదే అధికారం: జోగి

image

AP: రాష్ట్రంలో మరో 25 ఏళ్లపాటు వైసీపీదే అధికారం అని మంత్రి జోగి రమేశ్ అభిప్రాయపడ్డారు. ‘అన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. మళ్లీ వైసీపీదే అధికారం. చంద్రబాబు సీఎం కావాలని అనుకోవడం లేదు. ఎమ్మెల్యే అయితే చాలని భావిస్తున్నారు. పవన్ కూడా అదే భావనలో ఉన్నారు. సీఎం జగన్ చేపట్టిన బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. ఈ నెల 25న మా పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 4, 2025

HYD: IITల్లో నీటిని ఒడిసిపట్టే చెరువు

image

రోజు రోజుకు పెరుగుతున్న పట్టణీకరణతో వర్షపు నీటిని ఒడిసిపట్టే పరిస్థితి తగ్గుతోంది. దీంతో ఎండాకాలంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన IIT HYD విద్యా సంస్థ 654 ఎకరాల ప్రాంగణంలో లోలెవెల్ ఏరియాలో చెరువును అందుబాటులోకి తెచ్చింది. అక్కడ కురిసిన వర్షపు నీరు మొత్తం ఇందులోకి వచ్చి చేరుతుంది. దీని కెపాసిటీ 2.28 కోట్ల లీటర్లుగా అధికారులు తెలిపారు.

News December 4, 2025

CBSE నోటిఫికేషన్.. 124 పోస్టులు

image

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 124 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అసిస్టెంట్ సెక్రటరీ, అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంఏ పాసై ఉండాలి. వయసు 27-35 ఏళ్లు. <>దరఖాస్తుకు<<>> చివరి తేదీ: డిసెంబర్ 22.

News December 4, 2025

రైతన్నా.. పంట వ్యర్థాలను తగలబెట్టొద్దు

image

పంటకాలం పూర్తయ్యాక చాలా మంది రైతులు ఆ వ్యర్థాలను తగలబెడుతుంటారు. వీటిని తొలగించడానికి అయ్యే ఖర్చును భరించలేక ఇలా చేస్తుంటారు. అయితే దీని వల్ల నేల సారం దెబ్బతినడంతో పాటు పంటకు మేలు చేసే కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వానపాములు, నులిపురుగులు నాశనమవుతాయి. ఫలితంగా పంట దిగుబడి తగ్గుతుంది. ఈ వ్యర్థాలను పంటకు మేలు చేసే ఎరువులుగా మార్చే సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.