News March 5, 2025
విరాట్ కోహ్లీ మరో ఘనత

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచారు. ఇప్పటివరకు ఈ టోర్నీలో విరాట్ 746 పరుగులు చేశారు. ఈ క్రమంలో శిఖర్ ధవన్ (701) రికార్డును చెరిపేశారు. వీరి తర్వాత గంగూలీ (665), ద్రవిడ్ (627) ఉన్నారు. అలాగే 2000 తర్వాత వన్డేల్లో అత్యధిక సింగిల్స్ తీసిన ప్లేయర్గా కోహ్లీ (5,868) నిలిచారు. ఆయన తర్వాత సంగక్కర (5,688) ఉన్నారు.
Similar News
News April 6, 2026
‘కుంభకర్ణుడి నిద్ర’కు కారణమేంటి?

ఎప్పుడూ నిద్రపోతూ, ఎంత పిలిచినా లేవని వాళ్లను కుంభకర్ణుడిలా నిద్రపోతున్నావని అంటాం. బలవంతుడైన కుంభకర్ణుడు ఇంద్రాసనం పొందడానికి బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తారు. ఇది ప్రమాదమని గ్రహించిన సరస్వతి అతని నాలుకపై చేరి నిద్రాసనం కోరుకొనేలా చేస్తారు. తర్వాత కుంభకర్ణుడి వినతి మేరకు 6 నెలలు నిద్ర, ఓరోజు మెలకువగా వరాన్ని బ్రహ్మ సవరిస్తారు.
* మీకు తెలిసి కుంభకర్ణుడిలా నిద్రపోయేవారెవరైనా ఉన్నారా?
<<-se>>#EPICSAYINGS<<>>
News April 6, 2026
ధోనీకి 2 రోజుల్లో ఫిట్నెస్ టెస్ట్?

CSK మాజీ కెప్టెన్ ధోనీ IPLలో త్వరలోనే ఆడే అవకాశాలు కన్పిస్తున్నాయి. 2 రోజుల్లో ఆయనకు ఫిట్నెస్ టెస్ట్ నిర్వహిస్తారని CSK క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అందులో పాస్ అయితే ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీతో జరిగే మ్యాచులో ఆయన బరిలోకి దిగుతారంటున్నాయి. ఫిట్నెస్ లేక IPLకు రెండు వారాల పాటు ధోనీ దూరమవుతారని జట్టు యాజమాన్యం చెప్పిన విషయం తెలిసిందే. కాగా CSK ఈ సీజన్లో ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓడిపోయింది.
News April 6, 2026
FLASH: పెరిగిన బంగారం, వెండి ధరలు

ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ (సీజ్ఫైర్) దిశగా సంకేతాలు రావడంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇవాళ <<19578430>>ఉదయంతో<<>> పోలిస్తే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,530 పెరిగి రూ.1,50,660కి చేరింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,400 వృద్ధితో రూ.1,38,100 వద్ద కొనసాగుతోంది. వెండి కూడా కేజీకి రూ.5,000 ఎగబాకి రూ.2,60,000 పలుకుతోంది.


