News September 20, 2025
AP మీదుగా మరో అమృత్ భారత్ రైలు

ఇండియన్ రైల్వేస్ మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించనుంది. ఇది ఒడిశాలోని బ్రహ్మపుర్ నుంచి APలోని పలాస, విజయనగరం స్టేషన్ల మీదుగా గుజరాత్లోని సూరత్ సమీపంలోని ఉద్నా స్టేషన్కు చేరుకుంటుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 11 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లలో కొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తున్నాయి. తాజాగా మరో సర్వీస్ ఏపీ స్టేషన్లను కలుపుతూ అందుబాటులోకి రానుంది.
Similar News
News September 20, 2025
బీచ్ ఫెస్టివల్ ప్రమోట్ చేసేలా ఫ్లాష్ మాబ్

AP: SEP 26, 27, 28 తేదీల్లో బాపట్ల(D) సూర్యలంక బీచ్లో నిర్వహించే బీచ్ ఫెస్టివల్కు వినూత్న ప్రచారం కల్పించేందుకు టూరిజం శాఖ సిద్ధమైంది. రాష్ట్రంలోని వర్సిటీల భాగస్వామ్యంతో సూర్యలంక, VJA, TPT, RJY, GNT, HYDలో ఫ్లాష్ మాబ్ నిర్వహించనున్నారు. వీటిలో పాల్గొన్న విద్యార్థులను SEP 27న వరల్డ్ టూరిజం డే రోజు CM చంద్రబాబు సత్కరిస్తారు. బీచ్ ఫెస్టివల్లో వాటర్ స్పోర్ట్స్, సీ పుడ్ ఆకర్షణగా నిలువనున్నాయి.
News September 20, 2025
పంచాయతీల్లో పట్టణ స్థాయి ప్రగతి: పవన్

AP: గ్రామ పంచాయతీల్లో గతంలో అమలులో ఉన్న లోపభూయిష్ట విధానాల ప్రక్షాళన అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీల పునర్వర్గీకరణ, నూతన విధానాల అమలుపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. 48 ఏళ్లనాటి సిబ్బంది నమూనాకు మార్పులు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆదాయం, జనాభా, ప్రాంతం ప్రాతిపదికన పంచాయతీలకు గ్రేడ్లు నిర్ణయించనున్నారు. క్యాబినెట్ ముందుకు త్వరలో నూతన విధానాలు తీసుకెళ్లనున్నారు.
News September 20, 2025
చకచకా చరణ్-సుకుమార్ మూవీ స్క్రిప్ట్ వర్క్

రామ్ చరణ్-బుజ్జిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం తర్వాత సుకుమార్-చెర్రీ మూవీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్, ప్రీవిజువలైజేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్ మాత్రమే కాకుండా.. నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించనున్నారు.