News July 18, 2024
మరో దారుణం.. 8 ఏళ్ల బాలికపై హత్యాచారం

APలో చిన్నారులపై లైంగిక దాడులు ఆగడంలేదు. <<13600394>>నంద్యాల<<>>, <<13625931>>విజయనగరం<<>> ఘటనలు మరవకముందే తిరుపతి(D)లో 8 ఏళ్ల బాలికను ఓ మానవమృగం చిదిమేసింది. బిహార్కు చెందిన దంపతులు దొరవారిసత్రంలోని ఓ రైస్ మిల్లులో పనిచేసేందుకు వచ్చారు. వారి కూతురును అదే మిల్లులో పనిచేస్తున్న బిహార్ వాసి దిలీప్(22) బిస్కెట్ల ఆశ చూపి అడవిలోకి తీసుకెళ్లాడు. చిన్నారిని రేప్ చేసి చంపేశాడు.
Similar News
News November 17, 2025
ఒకే కుటుంబంలో 18 మంది మృతి

సౌదీలో ఘోర <<18310005>>బస్సు<<>> ప్రమాదం HYDలో పెను విషాదాన్ని నింపింది. మృతులంతా HYD వాసులే కాగా రాంనగర్లోని నసీరుద్దీన్ ఫ్యామిలీకి చెందిన 18 మంది మరణించడం తీవ్రంగా కలిచివేస్తోంది. నసీరుద్దీన్ 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన కుమారుడు సిరాజుద్దీన్ మాత్రం ఉద్యోగరీత్యా USలో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో అతనొక్కడే మిగిలాడని వారి బంధువులు Way2Newsకు వెల్లడించారు.
News November 17, 2025
ఒకే కుటుంబంలో 18 మంది మృతి

సౌదీలో ఘోర <<18310005>>బస్సు<<>> ప్రమాదం HYDలో పెను విషాదాన్ని నింపింది. మృతులంతా HYD వాసులే కాగా రాంనగర్లోని నసీరుద్దీన్ ఫ్యామిలీకి చెందిన 18 మంది మరణించడం తీవ్రంగా కలిచివేస్తోంది. నసీరుద్దీన్ 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన కుమారుడు సిరాజుద్దీన్ మాత్రం ఉద్యోగరీత్యా USలో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో అతనొక్కడే మిగిలాడని వారి బంధువులు Way2Newsకు వెల్లడించారు.
News November 17, 2025
క్యాబినెట్ భేటీ ప్రారంభం

తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రజాకవి అందెశ్రీకి మంత్రి మండలి సంతాపం తెలిపింది. ఈనెల 24లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.


