News June 28, 2024
బిహార్లో కుప్పకూలిన మరో వారధి

బిహార్లో బ్రిడ్జిలు వరసగా పేకమేడల్లా కూలిపోతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే 3చోట్ల వారధులు కూలగా కిషన్గంజ్ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. మదియా నదిపై 2011లో కట్టిన బ్రిడ్జి వరదల కారణంగా కొట్టుకుపోయింది. ఇప్పటికే రాష్ట్రంలోని అరారియా జిల్లాలో 2, సివార్ జిల్లాలో ఓ బ్రిడ్జి కూలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వారధుల నాణ్యతపై ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.
Similar News
News January 14, 2026
సర్పవరం: జర్నలిస్టుపై వైసీపీ నేత దాడి చేశాడని నిరసన

పాత్రికేయుడు సూర్యప్రకాశ్ పై ఓ YCP నేత దాడి చేశాడని ఆరోపిస్తూ జర్నలిస్టులు మంగళవారం సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి, బాధ్యుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు వినతిపత్రం అందజేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
News January 14, 2026
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వాయిదా

ఇవాళ విడుదల కావాల్సిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2026 నోటిఫికేషన్ను <
News January 14, 2026
వచ్చే నెల 17 నుంచి టెన్త్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్

AP: టెన్త్ విద్యార్థులకు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రీఫైనల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వీటి అనంతరం గ్రాండ్ టెస్ట్, పబ్లిక్ పరీక్షలు ఉండనున్నాయి. మరోవైపు సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10 నుంచి 18 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.


