News May 26, 2024
పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు

AP: మాచర్ల MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు రామిరెడ్డిపై మరో హత్యాయత్నం కేసు నమోదైంది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై రాళ్ల దాడి ఘటనపై ఈ కేసు నమోదు చేశారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని కేసు ఫైల్ చేయగా.. స్పృహలోకి వచ్చిన అనంతరం సీఐ ఇచ్చిన స్టేట్మెంట్తో తాజా కేసు నమోదైంది. ఇప్పటికే టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేసిన ఘటనలో పిన్నెల్లిపై ఓ హత్యాయత్నం కేసు నమోదైంది.
Similar News
News February 8, 2026
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News February 8, 2026
విద్యార్థులకు అస్వస్థత.. కారకులపై CM సీరియస్

AP: పోలవరం(D) దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడానికి గల కారకులపై CM CBN ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటిలోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. బాధ్యులపై శాఖాపరమైన, అవసరాన్ని బట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. కాగా నిన్న టిఫిన్ చేశాక 92మంది విద్యార్థులకు కడుపునొప్పి, జ్వరం రావడంతో ఆస్పత్రులకు తరలించామని అధికారులు వివరించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కుదుటపడిందన్నారు.
News February 8, 2026
ప్రతి తప్పుకు శిక్ష ఉంటుంది!

గరుడ పురాణం ప్రకారం మనం చేసే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. పాపపుణ్యాల తీవ్రతను బట్టి నరకంలోని శిక్షలు ఉంటాయి. స్వర్గంలోని లోకాలు మారుతుంటాయి. ఈ లోకాలు భువర్లోకం నుంచి సత్యలోకం వరకు ఉంటాయి. జ్ఞానం, భక్తి, త్యాగాల ద్వారా వైకుంఠం, కైలాసం వంటి ఉన్నత స్థితిని పొందవచ్చు. స్వర్గనరకాలు మనం ఎంచుకున్న మార్గాలేనని, జీవితం పరీక్ష అయితే ‘కర్మ’ తుది తీర్పు అని ఈ పురాణం హెచ్చరిస్తోంది. సత్కర్మలే సద్గతికి ఆధారం.


