News October 4, 2024
హర్షసాయిపై బాధితురాలు మరో ఫిర్యాదు

AP: తనను యూట్యూబర్ హర్షసాయి మోసం చేశాడని ఫిర్యాదు చేసిన యువతి మరోసారి నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. హర్షసాయి తనపై సోషల్ మీడియాలో కావాలని ట్రోలింగ్ చేయిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను పోలీసులకు సమర్పించారు. ట్రోలింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఇప్పటికే హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైంది. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Similar News
News November 15, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

* ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
* దివంగత కవి అందెశ్రీ కొడుకు దత్తసాయికి డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం యోచన
* నల్గొండ జిల్లాలో వైద్యం వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత.. వైరల్ ఫీవర్తో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన పిల్లలకు ఇంజెక్షన్ చేయడంతో రియాక్షన్
* నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ
News November 15, 2025
మరో కీలక మావో లొంగుబాటు?

మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, మరో నేత అప్పాసి నారాయణ తమ కేడర్తో సరెండర్ కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 64 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. త్వరలో జరగబోయే లొంగుబాటుతో చాలామంది జనజీవన స్రవంతిలో కలిసే అవకాశముంది. ఇప్పటికే మావో టాప్ కమాండర్లు మల్లోజుల, తక్కళ్లపల్లి లొంగిపోయిన విషయం తెలిసిందే.
News November 15, 2025
జీఎస్టీ సంస్కరణలతో బీమా రంగం వృద్ధి: IRDAI

GST సంస్కరణలు అమలులోకి వచ్చిన తర్వాత బీమా రంగంలో వృద్ధి కనిపిస్తోందని IRDAI మెంబర్ దీపక్ సూద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బీమాను నిత్యవసర వస్తువుగా చూస్తోందన్నారు. బీమా పాలసీలపై జీఎస్టీని జీరో శాతానికి తీసుకురావడం ఇన్సూరెన్స్ రంగానికి కలిసొచ్చిందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వస్తున్న నష్టాల నుంచి బయటపడేందుకు ప్రత్యేక పాలసీలు రూపొందించాలని, జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు అందించాలని సూచించారు.


