News April 2, 2025
మయన్మార్లో మరోసారి భూకంపం

మయన్మార్లో మరోసారి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.7గా నమోదైంది. కాగా భూకంపం ధాటికి మయన్మార్లో ఇప్పటికే 2,700 మందికిపైగా ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. 4500 మందికిపైగా గాయాలపాలయ్యారు. మరోసారి భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భీతిల్లుతున్నారు. రోడ్లపైనే నివసిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.
Similar News
News September 10, 2025
జగన్ వ్యాఖ్యలకు మంత్రి లోకేశ్ కౌంటర్

AP: మెడికల్ కాలేజీలపై జగన్ <<17624092>>వ్యాఖ్యలకు<<>> మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. తామేమీ మెడికల్ కాలేజీలు అమ్మడం లేదని క్లారిటీ ఇచ్చారు. వైసీపీ హయాంలో ఎందుకు వాటిని పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని, ఇందులో పబ్లిక్ భాగస్వామ్యం ఉంటుందని వివరించారు. తెలియకపోతే సలహాదారులను అడిగి తెలుసుకోవాలని చురకలు అంటించారు. PPP వలన పేద విద్యార్థులకు నష్టం ఉండదని తెలిపారు.
News September 10, 2025
వరుస టాస్ ఓటములకు తెరదించిన టీమ్ ఇండియా

టీమ్ ఇండియా ఎట్టకేలకు టాస్ గెలిచింది. ఇవాళ ఆసియా కప్లో భాగంగా UAEతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ వరుస టాస్ ఓటములకు తెరదించింది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి వరుసగా 15 మ్యాచ్ల్లో IND టాస్ ఓడిన విషయం తెలిసిందే. 16వ మ్యాచ్లో ఈ స్ట్రీక్కు బ్రేక్ పడింది. అటు ఇవాళ్టి మ్యాచ్లో స్టార్ బౌలర్ అర్ష్దీప్కు చోటుదక్కలేదు. ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలని తనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
News September 10, 2025
చంద్రగ్రహణానికి నలుగురు PMలు బలి: గోయెంకా

వివిధ దేశాల ప్రధానులు పదవులు కోల్పోవడంపై పారిశ్రామికవేత్త గోయెంకా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘చంద్రగ్రహణం ఎఫెక్ట్తో రెండు రోజుల వ్యవధిలో జపాన్, ఫ్రాన్స్, నేపాల్, థాయిలాండ్ PMలు బలయ్యారు. ఇప్పుడు అందరి చూపు సూర్య గ్రహణంపై పడింది. తర్వాత బలయ్యేది ఓ పెద్ద ‘ఆరెంజ్ టింటెడ్’ లీడర్ కావొచ్చు’’ అంటూ జోస్యం చెప్పారు. దీంతో ఆ లీడర్ ఆరెంజ్ కలర్ హెయిర్తో ఉండే ట్రంపేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.