News April 2, 2025

మయన్మార్‌లో మరోసారి భూకంపం

image

మయన్మార్‌లో మరోసారి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదైంది. కాగా భూకంపం ధాటికి మయన్మార్‌లో ఇప్పటికే 2,700 మందికిపైగా ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. 4500 మందికిపైగా గాయాలపాలయ్యారు. మరోసారి భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భీతిల్లుతున్నారు. రోడ్లపైనే నివసిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.

Similar News

News April 3, 2025

ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన భువీ

image

RCB స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆల్‌టైమ్ రికార్డును సమం చేశారు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా ఘనత సాధించారు. ఇప్పటివరకు ఆయన 183 వికెట్లు తీసి డ్వేన్ బ్రావో రికార్డును భువీ సమం చేశారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచులో స్వింగ్ కింగ్ ఈ ఫీట్ సాధించారు. అలాగే IPL చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ ఆయన కొనసాగుతున్నారు. టోర్నీ పవర్ ప్లేలో ఇప్పటివరకు 73 వికెట్లు పడగొట్టారు.

News April 3, 2025

HCU వివాదంపై స్పందించిన రష్మిక మందన్న

image

HCU (హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ) వివాదంపై హీరోయిన్ రష్మిక మందన్న స్పందించారు. ఇందుకు సంబంధించి ఆమె తన SM ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘రాత్రికి రాత్రే జేసీబీలు, బుల్డోజర్లు.. విద్యార్థుల అరెస్టులు.. HCUలో అసలేం జరుగుతోంది. ఇప్పుడే ఈ విషయం తెలిసింది. నా హృదయం ముక్కలైనట్లు ఉంది. ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది’ అంటూ రష్మిక రాసుకొచ్చారు. కాగా హెచ్‌సీయూలో 400 ఎకరాల భూవివాదం జరుగుతున్న విషయం తెలిసిందే.

News April 3, 2025

జనాలను ఫూల్స్ చేస్తున్న చంద్రబాబు: రోజా

image

AP: ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు జనాలను ఫూల్స్ చేస్తున్నారని వైసీపీ నేత రోజా విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చడం చేతకాకపోతే పదవి నుంచి దిగిపోవాలని ఆమె డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు ఈవీఎంలను మేనేజ్ చేస్తారు కానీ కరువును మాత్రం చేయలేకపోతున్నారు. కరువుతో చాలా జిల్లాలు అల్లాడిపోతున్నా పట్టించుకోవడం లేదు. బాబు చెప్పే మాటలకు, చేసే పనులకు అసలు సంబంధమే లేదు’ అని ఆమె ఫైర్ అయ్యారు.

error: Content is protected !!