News February 28, 2025
అప్పుల బాధ.. మరో రైతు ఆత్మహత్య

TG: రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పుల బాధతో ఇటీవల నలుగురు రైతులు బలవన్మరణం చెందగా నిన్న మరో రైతు తనువు చాలించారు. భూపాలపల్లి జిల్లా వెంకటేశ్వరపల్లికి చెందిన బండారి రవి(54) రెండెకరాల్లో మిర్చి వేశారు. పంట పెట్టుబడి, కూతురు పెళ్లి కోసం రూ.10లక్షల అప్పు చేశారు. మిర్చికి గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పు చెల్లించలేకపోయారు. దీంతో పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకున్నారు.
Similar News
News November 24, 2025
శుభ సమయం (24-11-2025) సోమవారం

✒ తిథి: శుక్ల చవితి సా.5.55 వరకు
✒ నక్షత్రం: పూర్వాషాడ రా.7.40 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-మ.1.12, మ.2.46-మ.3.34
✒ వర్జ్యం: తె.4.08-ఉ.5.50
✒ అమృత ఘడియలు: మ.2.53-సా.4.35
News November 24, 2025
సిరిసిల్ల: యోగాలో మెరిసిన గిరిజన బిడ్డ

సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బంజేరు గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని బట్టు మనస్విని, ఒడిశా వేదికగా నవంబర్ 11-15 తేదీల్లో జరిగిన 4వ EMRS జాతీయ క్రీడా పోటీల్లో రజత పతకం సాధించి రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టింది. గతంలోనూ ఆమె నేషనల్ యోగా ఒలింపియాడ్, రాష్ట్ర స్థాయి పోటీల్లో కాంస్య పతకాలు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో పతకం సాధించిన మనస్వినిని పలువురు అభినందించారు.
News November 24, 2025
సిరిసిల్ల: యోగాలో మెరిసిన గిరిజన బిడ్డ

సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బంజేరు గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని బట్టు మనస్విని, ఒడిశా వేదికగా నవంబర్ 11-15 తేదీల్లో జరిగిన 4వ EMRS జాతీయ క్రీడా పోటీల్లో రజత పతకం సాధించి రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టింది. గతంలోనూ ఆమె నేషనల్ యోగా ఒలింపియాడ్, రాష్ట్ర స్థాయి పోటీల్లో కాంస్య పతకాలు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో పతకం సాధించిన మనస్వినిని పలువురు అభినందించారు.


