News November 28, 2024
పార్లమెంటుకు కాంగ్రెస్ నుంచి మరో గాంధీ

నెహ్రూ-గాంధీ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఏడుగురు పార్లమెంటుకు వెళ్లారు. 1951-52లో అలహాబాద్ నుంచి నెహ్రు *1967లో రాయ్బరేలీ నుంచి ఇందిరా గాంధీ *1980లో అమేథీ నుంచి సంజయ్ గాంధీ *1981లో అమేథీ నుంచి రాజీవ్ గాంధీ *1999లో అమేథీ నుంచి సోనియా గాంధీ *2004లో అమేథీ నుంచి రాహుల్ గాంధీ *2024లో వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ తరఫున మొదటిసారి పోటీ చేసి పార్లమెంటులో అడుగు పెట్టారు.
Similar News
News March 25, 2026
RCB పేరు మార్పు.. క్లారిటీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త ఓనర్లు రావడంతో టీమ్ పేరు మారుస్తారనే చర్చ నడుస్తోంది. దీనిపై యజమానుల్లో ఒకరైన అనన్య బిర్లా క్లారిటీ ఇచ్చారు. RCB పేరులో ఎలాంటి మార్పు ఉండదని, ఇకపైనా అదే నేమ్తో కొనసాగుతుందని స్పష్టతనిచ్చారు. కాగా ఆదిత్య బిర్లా, డేవిడ్ బ్లెజర్, బ్లాక్స్టోన్ కన్సార్షియం RCBని ఈ నెల 31లోపు టేకోవర్ చేసుకోనుంది. ఇక 28న IPL-2026 తొలి మ్యాచులో ఆ జట్టు SRHతో తలపడనుంది.
News March 25, 2026
సిఫార్సు.. ఇన్స్టాగ్రామ్కూ e-KYC

దేశంలో ఇన్స్టాగ్రామ్కు e-KYC తప్పనిసరి చేయాలని కేంద్ర హోం, ఐటీ మంత్రిత్వ శాఖలకు పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. SMలో ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా మోసాలు, వేధింపులను అరికట్టేందుకు ఈ విధానం తీసుకురావాలని సూచించింది. తద్వారా మహిళలు, మైనర్లకు డిజిటల్ మాధ్యమాలను మరింత సురక్షితంగా మార్చవచ్చని అభిప్రాయపడింది. అయితే దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి ఈ విధానంపై మీరేమంటారు.
News March 25, 2026
ట్రోలింగ్ను పట్టించుకోను: హరీశ్ శంకర్

తనపై SMలో జరుగుతున్న ట్రోలింగ్పై డైరెక్టర్ హరీశ్ శంకర్ ఘాటుగా స్పందించారు. ‘ట్రోల్ చేసేవారు ఎవరో, ఎక్కడ ఉంటారో తెలియదు. వాళ్లకు కనీసం తమ గుర్తింపును బయటపెట్టే ధైర్యం కూడా లేదు. అలాంటి వారిని నేను అస్సలు పట్టించుకోను. అలా అయితే ఎప్పుడో SMను వీడేవాడిని’ అని హరీశ్ స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ‘ఉస్తాద్ భగత్సింగ్’ను సకాలంలో థియేటర్లలోకి తీసుకురావడమే తన అతిపెద్ద విజయం అని పేర్కొన్నారు.


