News February 19, 2025

రాష్ట్రంలో మరో GBS మరణం

image

AP: రాష్ట్రంలో మరో జీబీఎస్ (గిలియన్ బారే సిండ్రోమ్) మరణం చోటుచేసుకుంది. జీబీఎస్ లక్షణాలతో షేక్ గౌహర్ ఖాన్ అనే మహిళ ఈ నెల 2న గుంటూరు జీజీహెచ్‌లో చేరారు. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. గౌహర్ ఖాన్ మరణంతో ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జీబీఎస్ బాధితులు భీతిల్లిపోతున్నారు. వైద్యులు ఈ వైరస్ ఏమీ చేయదని చెబుతున్నా రోగులకు గుబులు పుడుతోంది.

Similar News

News January 7, 2026

వైభవ్ మరో సెంచరీ

image

యూత్ క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ హవా కొనసాగిస్తున్నారు. U19 సౌతాఫ్రికాతో జరుగుతోన్న మూడో వన్డేలో 63 బంతుల్లో సెంచరీ చేశారు. ఇందులో 8 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్‌లో ఆరోన్(85) కూడా శతకానికి చేరువలో ఉన్నారు.
* మ్యాచ్‌ను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.

News January 7, 2026

రాజకీయమే అసలైన ‘లాభసాటి’ వ్యాపారం?

image

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధుల ఆస్తులు ఆకాశాన్నంటుతున్నాయి. 2024 ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆస్తులు 2014లో ₹22.59 కోట్లు ఉండగా 2024 నాటికి ₹146.85 కోట్లకు చేరాయి. పార్టీల వారీగా చూస్తే రీ-ఎలెక్ట్ అయిన ఎంపీల సగటు ఆస్తుల పెరుగుదల YSRCP (532%), MIM (488%) అగ్రస్థానంలో ఉన్నాయి. BJP ఎంపీల ఆస్తులు 108%, కాంగ్రెస్ 135%, TDP 177% పెరిగాయి. దీనిపై మీ కామెంట్?

News January 7, 2026

IRCTC ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు గుడ్‌న్యూస్

image

IRCTC ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే అడ్వాన్స్ రిజర్వేషన్ ఓపెనింగ్ డే (60 రోజుల ముందు)లో ఉదయం 8 నుంచి సా.4 గంటల వరకు టికెట్స్ బుక్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఆధార్ లింక్ లేకుంటే సా.4 గంటల తర్వాత మాత్రమే బుక్ చేసుకోగలరు. అయితే, JAN 12 నుంచి వెరిఫైడ్ యూజర్ల బుకింగ్ టైమ్ రాత్రి 12 గంటల వరకు పొడిగించనుంది. దీంతో, నాన్ వెరిఫైడ్ యూజర్లు ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోలేరు.