News June 13, 2024
మార్చి 1న మరో హై ఓల్టేజ్ మ్యాచ్?

క్రికెట్లో మరో హై ఓల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా వచ్చే ఏడాది మార్చి 1న లాహోర్లో భారత్-పాకిస్థాన్ తలపడనున్నట్లు సమాచారం. PCB తయారు చేసిన డ్రాఫ్ట్ షెడ్యూల్లో ఇది ఖరారైనట్లు తెలుస్తోంది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ పాక్లో జరగనుంది. కానీ అక్కడ ఆడేది లేదని భారత్ తెగేసి చెబుతోంది. ఎలాగైనా తమ దేశానికి భారత్ను రప్పించాలని PCB గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
Similar News
News December 4, 2025
గుర్తింపు, పదవుల కోసం పాకులాడను: పవన్

AP: నిస్సహాయులకు అండగా నిలబడటమే నాయకుడి లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. చిత్తూరులో కూటమి కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. తాను గుర్తింపు, పదవుల కోసం పాకులాడలేదని తెలిపారు. ప్రజలకు సేవ చేసే ప్రయాణంలో పదవి వస్తే అలంకారం కాదు బాధ్యత అని నమ్ముతానన్నారు. అదృష్టవశాత్తు తన పేషీలోని అధికారులు కూడా సమాజానికి మంచి చేద్దాం అనే తపన ఉన్నవాళ్లేనని పేర్కొన్నారు.
News December 4, 2025
మన రూపాయికి విలువే లేదు: ఖర్గే

డాలర్తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల <<18465153>>కనిష్ఠ స్థాయి<<>>కి చేరడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. కేంద్ర ప్రభుత్వం వల్లే రూపాయి క్షీణిస్తోందని ఆరోపించారు. ‘కేంద్రం విధానాలు మన కరెన్సీని బలహీనపరిచాయి. అవే బాగుంటే రూపాయి పైకి ఎగిసేది. మన ఆర్థిక పరిస్థితి బాగా లేదని తెలుస్తోంది. మనకు నచ్చింది చెప్పుకోవచ్చు, మనల్ని మనం మెచ్చుకోవచ్చు. కానీ ప్రపంచంలో మన రూపాయికి విలువే లేదు’ అని ఫైరయ్యారు.
News December 4, 2025
నిర్మాత మృతి.. హీరో సూర్య కన్నీళ్లు

ప్రముఖ నిర్మాత, AVM స్టూడియోస్ అధినేత ఎం.శరవణన్(85) <<18464480>>భౌతికకాయానికి<<>> సీఎం స్టాలిన్, రజినీకాంత్ సహా అనేక మంది ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్థివ దేహాన్ని చూస్తూ హీరో సూర్య, ఆయన తండ్రి శివకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. సూర్య నటించిన సుందరాంగుడు, వీడొక్కడే సినిమాలను ఏవీఎం సంస్థే తెరకెక్కించింది. కాగా శరవణన్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి.


