News June 25, 2024

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

image

AP: మెగా DSCతో పాటు TET నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించిన TETలో పాస్ కాని వారు, తాజాగా B.ED, D.ED పూర్తి చేసిన వారికోసం ఈ నిర్ణయం తీసుకుంది. జులై 1న నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మొదట టెట్ నిర్వహించి, ఆ తర్వాత DSC ప్రిపరేషన్‌కు 30 రోజుల సమయం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక నుంచి ప్రతి ఏడాదీ డీఎస్సీ నిర్వహించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Similar News

News October 10, 2024

రతన్ టాటా మృతి పట్ల కేంద్రమంత్రులు, రాహుల్ సంతాపం

image

దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా మృతి పట్ల కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా, పియూష్ గోయల్ సంతాపం తెలియజేశారు. ఇండియా ఇండస్ట్రీకి రతన్ టాటా టైటాన్ అని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. టాటా నిజమైన దేశభక్తుడని అమిత్ షా పేర్కొన్నారు. పరిశ్రమలకు రతన్ చేసిన కృషి మన దేశంతో పాటు ప్రపంచంపై చెరగని ముద్ర వేసిందని నడ్డా తెలిపారు. రతన్ కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి రాహుల్ గాంధీ సంతాపం తెలియజేశారు.

News October 10, 2024

ప్రిడేటర్ డ్రోన్స్, అణు సబ్‌మెరైన్ల కొనుగోలుకు సీసీఎస్ ఆమోదం

image

రెండు అణు జలాంతర్గాముల నిర్మాణంతో పాటు 31 ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు PM మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(CCS) ఆమోదం తెలిపింది. సబ్‌మెరైన్లను రూ.40వేల కోట్లతో వైజాగ్‌లో నిర్మించనున్నారు. USకు చెందిన జనరల్ అటామిక్స్ సంస్థ నుంచి డ్రోన్లను కొనుగోలు చేస్తారు. ఇవి వచ్చే నాలుగేళ్లలో దశలవారీగా భారత్‌ చేతికి అందుతాయి. అందులో నేవీకి 15, ఆర్మీ, వాయుసేనకు చెరో 8 డ్రోన్లు కేటాయించారు.

News October 10, 2024

అక్టోబర్ 10: చరిత్రలో ఈ రోజు

image

1906: రచయిత R.K.నారాయణ్ జననం
1967: హాస్య నటుడు ఆలీ జననం
1973: దర్శకుడు రాజమౌళి జననం
1990: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జననం
2022: సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణం
✶ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం