News July 20, 2024

‘రుణమాఫీ’పై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

image

TG: పంట రుణాల మాఫీపై ప్రీ ఆడిట్ నిర్వహించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనికోసం 16 వేల మంది రైతుల రుణ ఖాతాలను పరిగణనలోకి తీసుకోనుంది. ఆడిట్ పూర్తయ్యే వరకు వారి ఖాతాల్లో నిధులు జమకావని తెలిపింది. మరోవైపు దాదాపు లక్షకు పైగా ఖాతాల్లో అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిపై విచారణ జరిపిన తర్వాతే రుణమాఫీ నిధులు జమ చేయనుంది.

Similar News

News October 21, 2025

బీజేపీ-ఆప్ మధ్య ‘పొల్యూషన్’ పంచాయితీ

image

ఢిల్లీలో పొల్యూషన్ సమస్య బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. దీపావళి వేళ కాలుష్యాన్ని నియంత్రించడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని ఆప్ రాష్ట్రాధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. దీంతో ఆ పార్టీపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో పంటల కాల్చివేత వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మండిపడింది. పొల్యూషన్‌కు దీపావళిని బ్లేమ్ చేయొద్దని హితవు పలికింది.

News October 21, 2025

ఇండియా-A జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా పంత్

image

INDలో SA-Aతో ఈనెల 30 నుంచి స్టార్ట్ కానున్న 4 రోజుల మ్యాచ్‌‌లకు BCCI జట్టును ప్రకటించింది. పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
ఫస్ట్ మ్యాచ్ టీమ్: పంత్(C), మాత్రే, జగదీశన్, సుదర్శన్(VC), పడిక్కల్, పాటిదార్, హర్ష్, తనుష్, మానవ్, కాంబోజ్, యశ్, బదోనీ, జైన్
2nd మ్యాచ్: పంత్(C), రాహుల్, జురెల్, సుదర్శన్, పడిక్కల్, గైక్వాడ్, హర్ష్, తనుష్, మానవ్, ఖలీల్, బ్రార్, ఈశ్వరన్, ప్రసిద్ధ్, సిరాజ్, ఆకాశ్

News October 21, 2025

డేంజర్ జోన్‌లోకి ఢిల్లీ ‘గాలి’!

image

దీపావళి తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఇవాళ ఉదయం చాణక్య ప్లేస్‌లో AQI 979గా, నారాయణ విలేజ్‌లో 940గా నమోదైంది. దీంతో ఆరోగ్యంగా ఉన్నవారు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, బయటకొస్తే N95, N99 మాస్కులను తప్పనిసరిగా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.