News September 24, 2025

వైజాగ్‌కు మరో ప్రముఖ ఐటీ కంపెనీ?

image

AP: వైజాగ్‌కు మరో ప్రముఖ టెక్ కంపెనీ యాక్సెంచర్ రానుంది. నగరంలో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆ సంస్థ చూస్తున్నట్లు రాయిటర్స్ కథనంలో పేర్కొంది. ఎకరాకు 99పైసల చొప్పున పది ఎకరాల భూమి లీజుకు కేటాయిస్తే 12వేల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రతిపాదించినట్లు తెలిపింది. ఇప్పటికే <<17551159>>TCS<<>>, కాగ్నిజెంట్ వంటి సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దీంతో మరిన్ని టెక్ అనుబంధ సంస్థలు వచ్చే అవకాశముంది.

Similar News

News September 24, 2025

ఏపీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం

image

AP: అసెంబ్లీలో 3 బిల్లుల(SC వర్గీకరణ, పంచాయతీ రాజ్ చట్ట సవరణ, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సవరణ)కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. మంత్రి డోలా వీరాంజనేయస్వామి ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లును సభ ఆమోదించింది. దీని ప్రకారం గ్రూప్-1లో అత్యంత వెనుకబడిన 12 కులాలకు 1%, గ్రూప్-2లోని 18 కులాలకు 6.5%, గ్రూప్-3లోని 29 కులాలకు 7.5% రిజర్వేషన్ అమలవనుంది. అలాగే నాలా ఫీజు స్థానిక సంస్థలకే దక్కే బిల్లూ ఆమోదం పొందింది.

News September 24, 2025

మార్కెట్లను వెంటాడుతున్న నష్టాలు

image

దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాలు వెంటాడుతున్నాయి. ఇవాళ కూడా మార్కెట్లు రెడ్‌లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయాయి. కొన్ని కంపెనీలు మినహా అన్ని రంగాల షేర్లు పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నెగటివ్ సైన్, అమెరికా H1B వీసా నిబంధనలు ఈ నష్టాలకు కారణంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

News September 24, 2025

OCT 3 నుంచి రేషన్ షాపుల బంద్‌కు నిర్ణయం

image

TG: కమీషన్ బకాయిలు చెల్లించకపోవడంతో అక్టోబర్ 3 నుంచి రేషన్ దుకాణాలు మూసివేసి నిరసన చేయాలని తీర్మానించినట్లు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజు ప్రకటించారు. 1, 2 తేదీల్లో డీలర్లంతా ఉపవాస దీక్షలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. 6 నెలల కమీషన్ రూ.120 కోట్లతో పాటు గన్నీ బ్యాగుల డబ్బులు రూ.6 కోట్లు, కేవైసీకి సంబంధించి రూ.15 కోట్లు ప్రభుత్వం చెల్లించాలని ఆయన వివరించారు.