News May 24, 2024
పూరీ-నాగ్ కాంబోలో మరో సినిమా?

డైరెక్టర్ పూరీ జగన్నాథ్, కింగ్ అక్కినేని నాగార్జున కలిసి మరో సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సినీవర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. గతంలో వీరిద్దరి కాంబోలో శివమణి, సూపర్ అనే రెండు చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం నాగ్ ‘కుబేర’ సినిమాతో బిజీగా ఉండగా, పూరీ ‘డబుల్ ఇస్మార్ట్’ను తెరకెక్కిస్తున్నారు.
Similar News
News December 6, 2025
ఇండిగోపై కేంద్రం సీరియస్.. మీటింగ్కు రావాలని ఆదేశం

ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన ఇండిగో యాజమాన్యంపై కేంద్ర విమానయాన శాఖ మరోసారి సీరియస్ అయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఇండిగో యాజమాన్యాన్ని ఆదేశించింది. రద్దు చేసిన టికెట్ ఛార్జీలను రేపు సాయంత్రం 8 గంటల లోపు రిటర్న్ చేయాలని ఇప్పటికే సూచించింది.
News December 6, 2025
కాలాలకు అతీతం ఈ మహానటి

తెలుగువారికి మహానటి అనగానే గుర్తొచ్చే పేరు సావిత్రి. చక్కటి అభినయంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఆమె నిజ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసారు. తెలుగు, తమిళ భాషల్లో 84 చిత్రాల్లో నటించిన ఆమె సింగిల్ టేక్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. నటనతో, మానవత్వంతో ఎందరికో స్పూర్తినింపిన ఆమె నటిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండి తెరపై చెరగని ముద్ర వేశారు. నేడు మహానటి సావిత్రి జయంతి.
News December 6, 2025
డికాక్ సెంచరీ.. 2 వికెట్లు తీసిన ప్రసిద్ధ్

టీమ్ ఇండియాతో జరుగుతున్న చివరి వన్డేలో దక్షిణాఫ్రికా ప్లేయర్ డికాక్ సెంచరీ చేశారు. 80 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో ఈ మార్క్ చేరుకున్నారు. వన్డేల్లో డికాక్కు ఇది 23వ సెంచరీ. మరోవైపు తన తొలి రెండు ఓవర్లలో భారీగా పరుగులిచ్చిన భారత బౌలర్ ప్రసిద్ధ్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశారు. కాగా ఈ మ్యాచులో గెలిచిన జట్టు మూడు వన్డేల సిరీస్ను 2-1తో కైవసం చేసుకోనుంది.


