News October 19, 2024
హైదరాబాద్లో మరో కొత్త జైలు?

TG: హైదరాబాద్లో మరో కొత్త జైలు ఏర్పాటు చేసేందుకు జైళ్ల శాఖ అధికారులు యోచిస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దీనిని ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం అండర్ ట్రయల్ ఖైదీలను చంచల్గూడ జైలుకు తరలిస్తుండటంతో కిక్కిరిసిపోతోంది. 1250 మంది ఖైదీలను ఉంచాల్సిన జైల్లో ఒక్కోసారి 2,000 మందిని ఉంచుతున్నారు. ఆ జైలుపై భారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News October 18, 2025
బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే పిల్లలు పుట్టరా?

ప్రస్తుతకాలంలో చిన్నవయసులోనే చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ చికిత్స వల్ల అండాశయాలు బలహీనమై పిల్లలు పుట్టడం కష్టమవుతుందంటున్నారు నిపుణులు. అందుకే క్యాన్సర్ ట్రీట్మెంట్కి ముందే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చేయాలని సూచిస్తున్నారు. అండాశయ బాహ్యపొరలో ఉండే అపరిపక్వ అండాలను చికిత్సకు ముందే తీసి ఫ్రీజ్&ప్రిజర్వ్ చేస్తారు. తర్వాత తిరిగి బాడీలో ఇంప్లాంట్ చేస్తే గర్భం దాల్చే అవకాశముంటుంది.
News October 18, 2025
పుతిన్ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం

ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ICC) వారెంట్ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలో హంగేరీ వేదికగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్తో భేటీ అయ్యాక ఆయనను అదుపులోకి తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. అయితే అలాంటిదేమీ ఉండదని సమాచారం. ICCకి అరెస్ట్ చేసే అధికారం లేదు. అందులోని సభ్యదేశాలే ఈ పనిచేయాలి. కాగా పుతిన్కు భద్రత కల్పిస్తామని హంగేరీ PM చెప్పడం గమనార్హం.
News October 18, 2025
విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

AP: VSP పార్ట్నర్షిప్ సమ్మిట్పై భారీ అంచనాలున్నాయి. పారిశ్రామికవేత్తలను పిలిచేందుకు CBN, లోకేశ్ విదేశాలకు వెళ్తున్నారు. గూగుల్, TCS వంటి సంస్థల రాకతో ఈసారి పెట్టుబడులు పెరగొచ్చంటున్నారు. కాగా 2016లో ₹7.03L Cr, 2017లో ₹6.98L Cr, 2018లో ₹3.10L Cr పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వాటిలో పెండింగ్ అంశాల్ని పట్టాలెక్కించడంతో పాటు ఈసారి కొత్తవారిని ఆహ్వానించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.