News September 12, 2024
డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం

AP: డిగ్రీలో చేరేందుకు విద్యార్థులకు ఉన్నత విద్యామండలి మరో అవకాశం ఇచ్చింది. ఇటీవల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 15వ తేదీకి పొడిగించింది. 18వ తేదీ వరకు విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చని, 19న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుందని పేర్కొంది. 22న సీట్ల కేటాయింపు జరుగుతుందని, 22 నుంచి 25వ తేదీలోగా కాలేజీల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయాలని సూచించింది.
Similar News
News November 18, 2025
ఇన్నేళ్లయినా 21వేల గ్రామాల్లో మొబైల్ సిగ్నల్ లేదు!

ఇండియాలో ఇంకా మొబైల్ కనెక్టివిటీ లేని గ్రామాలున్నాయి. తాజాగా లద్దాక్లోని మారుమూల గ్రామాలైన మాన్ & మెరాక్లో ఎయిర్టెల్ తన సేవలను ప్రారంభించింది. దేశంలో 2024 సెప్టెంబర్ నాటికి దాదాపు 21వేల గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ లేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఒడిశాలో అత్యధికంగా 6వేల గ్రామాలు ఫోన్ వాడట్లేదు. కొండలు, లోయలు, దట్టమైన అడవుల్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో టవర్లను ఏర్పాటు చేయలేకపోతున్నారు.
News November 18, 2025
ఇన్నేళ్లయినా 21వేల గ్రామాల్లో మొబైల్ సిగ్నల్ లేదు!

ఇండియాలో ఇంకా మొబైల్ కనెక్టివిటీ లేని గ్రామాలున్నాయి. తాజాగా లద్దాక్లోని మారుమూల గ్రామాలైన మాన్ & మెరాక్లో ఎయిర్టెల్ తన సేవలను ప్రారంభించింది. దేశంలో 2024 సెప్టెంబర్ నాటికి దాదాపు 21వేల గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ లేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఒడిశాలో అత్యధికంగా 6వేల గ్రామాలు ఫోన్ వాడట్లేదు. కొండలు, లోయలు, దట్టమైన అడవుల్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో టవర్లను ఏర్పాటు చేయలేకపోతున్నారు.
News November 18, 2025
చానెల్ CEO లీనా నాయర్ గురించి తెలుసా?

అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ ‘Chanel’ గ్లోబల్ సీఈఓ లీనా నాయర్ భారతీయురాలని మీకు తెలుసా. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో పుట్టి పెరిగిన లీనా మేనేజ్మెంట్ డిగ్రీ చేశారు. 1992లో HULలో చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. అక్కడ ఆమె దక్షతను మెచ్చి చానెల్ CEOగా ఎంపిక చేశారు. ఆమె అందించిన సేవలకు గానూ యూకే ప్రభుత్వం అత్యున్నత గౌరవమైన కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (CBE)తో సత్కరించారు.


