News March 18, 2024

ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

image

ఇటీవల ఈసీ బయటపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలు రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న వేళ.. సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. 2018 మార్చి 1 నుంచి 2019 ఏప్రిల్ 11 వరకు అమ్మిన రూ.4,002 కోట్ల విలువైన బాండ్ల వివరాలను వెల్లడించేలా SBIని ఆదేశించాలని సిటిజన్స్ ఫర్ రైట్స్ ట్రస్టు కోరింది. కాగా 2019 APR 12 నుంచి 2024 FEB 15 వరకు అమ్మిన బాండ్ల వివరాలు సుప్రీం ఆదేశాలతో బహిర్గతమైన విషయం తెలిసిందే.

Similar News

News September 4, 2025

ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే మా విధానం: PM మోదీ

image

GST సంస్కరణలతో దీపావళికి ముందే ప్రజలకు ఆనందం వచ్చిందని PM మోదీ అన్నారు. ‘ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే మా ప్రభుత్వ విధానం. హెయిర్ పిన్నులు కూడా విదేశాల నుంచి తెచ్చుకునే విధానం మారాలి. కొత్త సంస్కరణల వల్ల మరింత ముందుగానే ఆత్మనిర్భర భారత్ సాకారం అవుతుంది. రూ.లక్ష కోట్ల విలువైన వంటనూనె దిగుమతి చేసుకుంటున్నాం. ఆ మొత్తం బయటకు వెళ్లకుండా ఆపగలిగితే ఎన్నో విద్యాలయాలు నిర్మంచవచ్చు’ అని PM తెలిపారు.

News September 4, 2025

రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ ఉత్తరాంధ్రలో అక్కడక్కడ జల్లులు పడ్డాయి. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది.

News September 4, 2025

బెస్ట్ లెక్చరర్స్‌కు అవార్డుల ప్రకటన

image

TG: యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో విశేష సేవలందించిన అధ్యాపకులకు ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. OU నుంచి నలుగురు, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, చాకలి ఐలమ్మ, అంబేడ్కర్ ఓపెన్, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ప్రొ.జయశంకర్ వర్సిటీల్లో ఒక్కొక్క లెక్చరర్‌ను, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ వర్సిటీలో ఇద్దరిని బెస్ట్ లెక్చరర్స్‌గా ఎంపిక చేసింది. లిస్ట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.