News July 2, 2024
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు మరో బాధ్యత!

AP: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయిస్తోన్న ప్రభుత్వం వారికి మరో బాధ్యత అప్పగించనుంది. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు తీసుకొచ్చిన స్కిల్ సెన్సెస్ కార్యక్రమంలో వారిని భాగస్వాములను చేయాలని భావిస్తోంది. APSSDC, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే అవకాశాలపై మంత్రి లోకేశ్ అధికారులతో చర్చించారు.
Similar News
News November 15, 2025
96 లక్షల ఫాలోవర్లు.. 50 వేల ఓట్ల తేడాతో ఓటమి

బిహార్ ఎన్నికల్లో జన్ సురాజ్ అభ్యర్థి, యూట్యూబర్ మనీశ్ కశ్యప్ పోటీ చేసి ఓడిపోయారు. చన్పటియా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభిషేక్ రంజన్ గెలుపొందారు. యూట్యూబ్లో 96 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న మనీశ్కు 37,172 ఓట్లు రాగా 50 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడారు. తమిళనాడులో వలస కూలీలపై దాడులు చేసి చంపుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలతో అప్పట్లో అతడిని TN పోలీసులు అరెస్టు చేశారు.
News November 15, 2025
ఏరో ఇంజిన్ రాజధానిగా తెలంగాణ: శ్రీధర్ బాబు

TG: ఏరో ఇంజిన్ రాజధానిగా తెలంగాణను తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలదే కీలక పాత్ర అని చెప్పారు. ఇప్పటికే 25కు పైగా ‘A&D’ సంస్థలు, 1500కు పైగా MSMEలు ‘TG బ్రాండ్’ను విస్తరించాయని చెప్పారు. ₹800 CRతో JSW డిఫెన్స్ ‘UAV మాన్యుఫ్యాక్చరింగ్ UNIT’, ₹500 CRతో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ డిఫెన్స్ ఫెసిలిటీ వస్తున్నాయన్నారు.
News November 15, 2025
తిప్పేస్తున్న జడేజా.. 6 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. రెండో ఇన్నింగ్సులో RSA 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 4 వికెట్లతో సత్తా చాటారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 45 పరుగుల లీడ్లో ఉంది. ఇవాళ మరో 17 ఓవర్ల ఆట మిగిలి ఉంది.


