News September 30, 2024
2 నెలల్లో మరో రూ.60,000 కోట్ల ఐపీవోలు

ఈ ఏడాది తొలి 9 నెలల్లో 62 కంపెనీలు రూ.64,513 కోట్లను ఐపీవోల ద్వారా సమీకరించాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో మరో రూ.60,000 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. హ్యుందాయ్ ఇండియా, స్విగ్గీ, NTPC గ్రీన్ ఎనర్జీ, ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వారీ ఎనర్జీస్ తదితర కంపెనీలు ఐపీవోలకు రానున్నాయి. 2021లో రూ.1.19 లక్షల కోట్లు సమీకరించగా, ఈ ఏడాది రూ.1.25 లక్షల కోట్లు దాటనుంది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం.
Similar News
News October 27, 2025
APPLY NOW: SBIలో 103 పోస్టులు

SBI 103 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి నవంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, సీఏ, సీఎఫ్ఏ, సీఎఫ్పీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.750, SC, ST, PWBDలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://sbi.bank.in/ *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News October 27, 2025
$1B కాంట్రాక్ట్ రద్దు.. సైబర్ దాడుల వల్ల కాదు: TCS

Marks & Spencer కంపెనీ తమతో 1B డాలర్ల హెల్ప్డెస్క్ కాంట్రాక్టును ముగించడంపై TCS స్పందించింది. సైబర్ దాడులకు, కాంట్రాక్ట్ ముగించడానికి సంబంధం లేదని చెప్పింది. సైబర్ దాడి వైఫల్యాల వల్లే M&S కంపెనీ కాంట్రాక్టును పునరుద్ధరించలేదన్న టెలిగ్రాఫ్ కథనాన్ని తోసిపుచ్చింది. ‘సైబర్ దాడులు ఏప్రిల్లో జరిగాయి. కానీ మరో కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకునేందుకు జనవరిలోనే M&S టెండర్లు ప్రారంభించింది’ అని తెలిపింది.
News October 27, 2025
70 రకాల సొంత విత్తనాలతో సేంద్రియ సేద్యం

30 ఏళ్లుగా సేంద్రియ సేద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సంగారెడ్డి జిల్లా బిడెకన్నకు చెందిన రైతు చిన్న చంద్రమ్మ. విత్తనాలు, ఎరువుల కోసం ఇతరులపై ఆధారపడకుండా తెలంగాణ డీడీఎస్ KVKతో కలిసి 70కి పైగా విభిన్న విత్తనాలను నిల్వ చేసి వాటినే సాగు చేస్తూ, ఇతర రైతులకు అందిస్తున్నారు. సాగు, రైతులపై పాటలు కూర్చి రేడియోలో పాడి స్ఫూర్తి నింపుతున్నారు.☛ రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


