News July 18, 2024
రుణమాఫీ పేరిట రేవంత్ సర్కార్ మరో మోసం: KTR

TG: రైతుబంధు కింద ఇవ్వాల్సిన నిధుల నుంచి రేవంత్ సర్కార్ రూ.7వేల కోట్లు రుణమాఫీకి దారి మళ్లించిందని మాజీ మంత్రి KTR ఆరోపించారు. రుణమాఫీ పేరుతో మరోసారి రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు. 40 లక్షల మందికిపైగా రుణాలు తీసుకుంటే 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారని Xలో ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని, అర్హులకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 15, 2025
ఆర్చరీ క్రీడాకారులను అభినందించిన జేసీ

భీమవరం కలెక్టరేట్లో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్కూల్ గేమ్స్ అండర్ 14,17 విభాగాల్లో ఆర్చరీ పోటీల్లో రాష్ట్ర స్థాయి బంగారు, వెండి పథకాలను సాధించిన క్రీడాకారులు శనివారం కలిశారు. ఈ సందర్భంగా జేసీ ఆర్చరీలో పథకాలు సాధించిన క్రీడాకారులను అభినందిస్తూ, రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కొంత సమయాన్ని కేటాయించాలని అన్నారు.
News November 15, 2025
పేదల తరఫున గొంతెత్తుతూనే ఉంటాం: RJD

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన ఆర్జేడీ ఫలితాలపై తొలిసారి స్పందించింది. ప్రజాసేవ నిరంతర ప్రక్రియ అని, దానికి అంతం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎత్తుపల్లాలు సహజమని పేర్కొంది. ఓటమితో విచారం.. గెలుపుతో అహంకారం ఉండబోదని తెలిపింది. ఆర్జేడీ పేదల పార్టీ అని, వారి కోసం తన గొంతును వినిపిస్తూనే ఉంటుందని ట్వీట్ చేసింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 25 సీట్లకు పరిమితమైన విషయం తెలిసిందే.
News November 15, 2025
రైల్ వీల్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు

బెంగళూరులోని <


