News August 14, 2025

హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ

image

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC స్థానాల్లో ఉప ఎన్నికకు రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన న్యాయస్థానం కొట్టివేసింది. కాగా పులివెందుల పరిధిలో 15 పోలింగ్ కేంద్రాల్లో, ఒంటిమిట్ట పరిధిలోని 30 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వైసీపీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.

Similar News

News August 14, 2025

వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూటమిదే విజయం: మంత్రి

image

AP: వచ్చే ఎన్నికల్లో(అసెంబ్లీ, పార్లమెంటు) పులివెందులలో కూటమిదే విజయమని మంత్రి పార్థసారధి ధీమా వ్యక్తం చేశారు. ‘పులివెందుల ZPTC ఎన్నికల్లో TDP విజయం 2029 ఎన్నికల్లో కూటమి విజయానికి తొలి మెట్టు. YCPకి ఇది బలమైన నియోజకవర్గం. ఓటింగ్‌ను బహిష్కరించాలని ఆ పార్టీ చెప్పినా 55-65% పోలింగ్ నమోదైంది. ప్రజల్లో YCPపై ఉన్న వ్యతిరేకతకు ఇదే నిదర్శనం. పోలీసులను జగన్ కించపరచడం సరైంది కాదు’ అని వ్యాఖ్యానించారు.

News August 14, 2025

క్లౌడ్ బరస్ట్.. 22 మంది మృతిపై PM మోదీ దిగ్భ్రాంతి

image

J&Kలోని కిష్త్వార్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ వల్ల 22మంది మృతిచెందడంపై PM మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నట్లు వివరించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. బాధితులకు అవసరమైన ఏ సాయాన్ని అందించడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. మరోవైపు అమిత్ షా సైతం J&K CM ఒమర్ అబ్దుల్లాకు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

News August 14, 2025

వివేకాకు న్యాయం చేయాలని స్లిప్: కౌంటింగ్‌ వేళ వెలుగుచూసిందన్న TDP

image

AP: పులివెందులలో జడ్పీటీసీ ఉపఎన్నిక కౌంటింగ్ సందర్భంగా ‘మా వివేకా సార్‌కి న్యాయం చేయండి సార్’ అని స్లిప్ వచ్చిందని టీడీపీ ట్వీట్ చేసింది. బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టే సమయంలో అజ్ఞాత వ్యక్తి వేసిన ఈ కాగితం బయటపడినట్లు పేర్కొంది. ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని, త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు వివరించింది. పులివెందుల ZPTC ఉప ఎన్నికలో TDP అభ్యర్థి లతారెడ్డి గెలిచిన విషయం తెలిసిందే.