News October 17, 2024
టీమ్ ఇండియాకు మరో షాక్!

న్యూజిలాండ్తో తొలి టెస్టులో టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడ్డారు. మోకాలికి బంతి తాకడంతో నొప్పి భరించలేక మైదానం వీడారు. అతడి స్థానంలో ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్కు వచ్చారు. గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై జట్టు నుంచి అప్డేట్ రావాల్సి ఉంది. ఒకవేళ పంత్ గాయంతో దూరమైతే సెకండ్ ఇన్నింగ్స్లో భారత బ్యాటింగ్ లైనప్ కాస్త బలహీన పడే ఛాన్స్ ఉంది.
Similar News
News November 18, 2025
అగ్ర హీరోల నటగురువు కన్నుమూత

చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ కేఎస్ నారాయణస్వామి(92) కన్నుమూశారు. ఆయన మృతదేహానికి రజినీకాంత్ నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. సినీ వర్గాల్లో నారాయణస్వామి.. కేఎస్ గోపాలిగా సుపరిచితం. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, నాజర్, రాధా రవి వంటి ప్రముఖులకు నటనలో ఆయన పాఠాలు చెప్పారు. రజినీని డైరెక్టర్ బాలచందర్కు పరిచయం చేసింది కూడా ఈయనే.
News November 18, 2025
అగ్ర హీరోల నటగురువు కన్నుమూత

చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ కేఎస్ నారాయణస్వామి(92) కన్నుమూశారు. ఆయన మృతదేహానికి రజినీకాంత్ నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. సినీ వర్గాల్లో నారాయణస్వామి.. కేఎస్ గోపాలిగా సుపరిచితం. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, నాజర్, రాధా రవి వంటి ప్రముఖులకు నటనలో ఆయన పాఠాలు చెప్పారు. రజినీని డైరెక్టర్ బాలచందర్కు పరిచయం చేసింది కూడా ఈయనే.
News November 18, 2025
AIతో 20 శాతానికి పెరగనున్న నిరుద్యోగిత: ఆంత్రోపిక్ CEO డారియో

ఉద్యోగ మార్కెట్పై AI ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఆంత్రోపిక్ CEO డారియో అమోడీ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో సగం ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ జాబ్స్ కనుమరుగయ్యే ఛాన్స్ ఉందన్నారు. భవిష్యత్తులో అన్ఎంప్లాయిమెంట్ను 10 నుంచి 20 శాతానికి పెంచుతుందని అంచనా వేశారు. కన్సల్టింగ్, లా, ఫైనాన్స్ వంటి ప్రొఫెషన్స్కూ రిస్క్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ రంగాల్లో AI మోడల్స్ బాగా పనిచేస్తున్నాయని చెప్పారు.


