News April 2, 2024
గులాబీ పార్టీకి మరో షాక్.. కాంగ్రెస్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే

TG: బీఆర్ఎస్కు మరో ఎమ్మెల్యే షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ నేతల సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దీంతో తెల్లం పార్టీ మారనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే ఆయన సీఎం రేవంత్తో పాటు ఇతర నేతలతోనూ పలుమార్లు సమావేశమైన సంగతి తెలిసిందే.
Similar News
News April 1, 2026
‘మీ సేవ’ ఛార్జీల పెంపు

TG: ‘మీ సేవ’ కేంద్రాల ద్వారా అందించే వివిధ ధ్రువపత్రాలు, ఇతర సేవలకు ప్రభుత్వం ఛార్జీలు పెంచింది. నేటి నుంచే అవి అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు రూ.35గా ఉన్న కనీస ఛార్జీని రూ.62కి పెంచింది. A కేటగిరీ సేవలకు రూ.62 చొప్పున, B కేటగిరీ సర్వీసులకు రూ.80 చొప్పున రుసుమును నిర్ణయించింది. B- కేటగిరీలో కమ్యూనిటీ, ఇన్కమ్, రెసిడెన్స్, రేషన్ కార్డు, OBC, EWS సర్టిఫికెట్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తదితర సేవలున్నాయి.
News April 1, 2026
ఇరాన్ యుద్ధం.. అమెరికాతో విభేదించిన బ్రిటన్

ఇరాన్ యుద్ధం విషయంలో <<19525908>>అమెరికా<<>>తో బ్రిటన్ విభేదించింది. ఈ ఘర్షణల్లోకి ప్రవేశించేది లేదని PM స్టార్మర్ తేల్చి చెప్పారు. యుద్ధంతో సంబంధం లేనప్పటికీ.. తమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఘర్షణల్ని ఆపేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. హార్ముజ్ పున:ప్రారంభానికి ఉన్న మార్గాల్ని అన్వేషించేందుకు గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని తెలిపారు.
News April 1, 2026
7.30 గంటల నిడివితో ధురంధర్!

కంటెంట్, అధిక రన్ టైమ్తో ప్రేక్షకులను థ్రిల్ చేసిన ‘ధురంధర్’ మేకర్స్ మరో సంచలనానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రెండు పార్టులు కలిపి 7 గంటల 30 నిమిషాల నిడివితో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన CBFC సర్టిఫికెట్ SMలో వైరలవుతోంది. OTTలో విడుదల చేస్తారా? థియేటర్లలో స్పెషల్ షోలు వేస్తారా? అనేది క్లారిటీ లేదు. గతేడాది ‘బాహుబలి: ది ఎపిక్’ 3 గంటల 44 నిమిషాలతో రిలీజైన విషయం తెలిసిందే.


