News June 23, 2024
విడాకుల బాటలో మరో టీమ్ ఇండియా క్రికెటర్?

టీమ్ ఇండియా క్రికెటర్ మనీశ్ పాండే-అశ్రిత శెట్టి జంట విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పెళ్లి ఫొటోలు తొలగించడమే ఇందుకు కారణం. ఉత్తరాఖండ్కు చెందిన మనీశ్.. మోడల్ అశ్రితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా మనీశ్ పాండే భారత్ తరఫున 29 వన్డేల్లో 566 పరుగులు, 39 టీ20ల్లో 709 రన్స్ చేశారు. అలాగే ఐపీఎల్లో దాదాపు అన్ని జట్లకు ఆయన ప్రాతినిథ్యం వహించారు.
Similar News
News December 5, 2025
నన్ను ఎన్నుకున్నది అరిచేందుకు కాదు: శశిథరూర్

ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడుతుండటంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో గొంతు వినిపించేందుకు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదన్నారు. ‘పార్టీలో నాది ఏకైక గొంతు కావచ్చు. కానీ పార్లమెంటులో ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించడానికే నన్ను ఎన్నుకున్నారు. అరవడానికో, గొడవలు చేయడానికో కాదు. వారి కోసం, దేశం కోసం మాట్లాడేందుకు పంపించారు’ అని అన్నారు.
News December 5, 2025
గూగుల్లో ఎక్కువగా వెతికిన అంశాలివే!

ఈ ఏడాది ఎక్కువగా శోధించిన అంశాల జాబితాను ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ప్లాట్ఫామ్ ‘Google’ రిలీజ్ చేసింది. ‘ఓవరాల్ ట్రెండింగ్ సెర్చ్’ విభాగంలో IPL అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత Google Gemini, Asia Cup, ICC Champions Trophy, Pro Kabaddi League, Maha Kumbh, Women’s World Cup, Grok, Saiyaara, ‘Dharmendra’ గురించి తెగ సెర్చ్ చేసినట్లు తెలిపింది. మరి మీరు ఏ విషయం గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు? COMMENT
News December 5, 2025
IndiGoకే సమస్య ఎందుకు.. ఏం జరుగుతోంది?

దేశంలో IndiGo తప్ప మిగతా ఎయిర్లైన్స్ సర్వీసులు మామూలుగానే నడుస్తున్నాయి. ఇండిగోకే ఎందుకు సమస్య వచ్చింది? నిజానికి పైలట్లకు వారానికి అదనంగా 12గంటల రెస్ట్ ఇవ్వాలని DGCA ఇటీవల రూల్ తెచ్చింది. అదనపు పైలట్ల నియామకానికి 18నెలల గడువిచ్చింది. ఎయిరిండియా, ఆకాశ, విస్తారా ఈ మేరకు సర్దుబాటు చేసుకోగా, ఇండిగో మాత్రం పట్టించుకోలేదు. 60% మార్కెట్ ఉన్న సంస్థ సిబ్బందిని ఎందుకు నియమించలేదనేది చర్చనీయాంశమవుతోంది.


