News June 23, 2024
విడాకుల బాటలో మరో టీమ్ ఇండియా క్రికెటర్?

టీమ్ ఇండియా క్రికెటర్ మనీశ్ పాండే-అశ్రిత శెట్టి జంట విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పెళ్లి ఫొటోలు తొలగించడమే ఇందుకు కారణం. ఉత్తరాఖండ్కు చెందిన మనీశ్.. మోడల్ అశ్రితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా మనీశ్ పాండే భారత్ తరఫున 29 వన్డేల్లో 566 పరుగులు, 39 టీ20ల్లో 709 రన్స్ చేశారు. అలాగే ఐపీఎల్లో దాదాపు అన్ని జట్లకు ఆయన ప్రాతినిథ్యం వహించారు.
Similar News
News November 24, 2025
శరణు ఘోషతోనే కొండ ఎక్కుతారు

శబరి యాత్రలో ఎత్తైన, నిట్టనిలువు కొండ ‘కరిమల’. సుమారు 10KM ఎత్తుకు వెళ్లిన తర్వాత భక్తులు దీని శిఖరాన్ని చేరుకుంటారు. ఇక్కడ అతి ప్రాచీనమైన బావి, జలపాతం ఉన్నాయి. భక్తులు ఇక్కడ దాహార్తిని తీర్చుకుంటారు. ఇంత ఎత్తులో జలపాతం ఉండటం దీని ప్రత్యేకత. ఈ కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే శరణు ఘోష ముందు ఈ కష్టం దూది పింజెలా తేలిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>
News November 24, 2025
IIT ధన్బాద్ 105 పోస్టులకు నోటిఫికేషన్

<
News November 24, 2025
జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. జీవో నం.46 ప్రకారం 50% క్యాప్తో రిజర్వు స్థానాలు ఖరారు చేస్తూ కాసేపటి క్రితం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందులో SC, STల పంచాయతీలు యథాతథంగా ఉండగా 22% రిజర్వేషన్ మాత్రమే అమలు చేస్తుండటంతో పలుచోట్ల BCల రిజర్వు స్థానాలు మారాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సైతం ఈ వివరాలు పంపింది.


