News September 8, 2024
మరో ముప్పు.. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి: కిషన్ రెడ్డి

TG: వరద బాధితులను మోదీ ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిన వెంటనే పూర్తి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. సాయం విషయంలో కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదన్నారు. మరోసారి తుఫాన్ ముప్పు పొంచి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధితులను ఆదుకునేందుకు సామాజిక, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Similar News
News January 20, 2026
23న రాజధాని రైతులకు ఇ-లాటరీ: నారాయణ

AP: రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు మంత్రి నారాయణ గుడ్న్యూస్ చెప్పారు. ‘అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లను ఈనెల 23న కేటాయిస్తాం. ఇ-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరుగుతుంది. రైతులు వాటిని అప్పటికప్పుడే రిజిస్టర్ చేయించుకోవచ్చు. పెండింగ్లో ఉన్న రైతులందరికీ అదే రోజు లాటరీ నిర్వహిస్తాం. రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది’ అని తెలిపారు.
News January 20, 2026
మాఘ మాసంలో నదీ స్నానాలు ఎందుకు చేయాలి?

మాఘ మాసంలో నదీ స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందట. శాస్త్రీయంగా చూస్తే.. ఈ సమయంలో సూర్యకిరణాలు ప్రత్యేక కోణంలో భూమిని తాకుతాయి. వాటిలోని అతినీల లోహిత సాంద్రత వల్ల ప్రవహించే నీటిలో చేసే స్నానం శరీరానికి గొప్ప శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. చలిని తట్టుకుని చేసే ఈ మాఘ స్నానం మనోబలాన్ని పెంచుతుంది.
News January 20, 2026
మన ఆయుష్షు తగ్గించే కొన్ని అపవిత్ర పనులు

కొన్ని అలవాట్లు మన ఆయుష్షును తగ్గిస్తాయని గరుడ పురాణం చెబుతోంది. దాని ప్రకారం.. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవకపోతే స్వచ్ఛమైన గాలి అందక అనారోగ్యం కలుగుతుంది. రాత్రిపూట పెరుగు, దాంతో చేసినవి తింటే వ్యాధులు రావొచ్చు. దక్షిణ, పడమర దిశలో తలపెట్టి నిద్రించడం, శ్మశానంలో మృతదేహాన్ని దహనం చేసేటప్పుడు వచ్చే విష వాయువు పీల్చడం హానికరం. స్త్రీలు, పిల్లలు, మానవత్వం పట్ల చెడు ఆలోచనలు ఉంటే ఆయుష్షు క్షీణిస్తుంది.


