News September 19, 2024

మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్

image

UPలోని బృందావన్ రోడ్ స్టేషన్ సమీపంలో బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్సు రైలు పట్టాలు తప్పింది. 20 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనతో ఢిల్లీ-మథుర మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యుద్ధప్రాతిపదికన ఆ రూట్‌ను క్లియర్ చేసేందుకు రైల్వే సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇటీవలకాలంలో దేశంలో వరుస రైలు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి.

Similar News

News November 26, 2025

ఆకుకూరల సాగుకు అనువైన రకాలు

image

ఆకుకూరల్లో చీడపీడలను తట్టుకొని, తక్కువ కాలంలో అధిక దిగుబడులను ఇచ్చే రకాలను సాగు చేస్తే మంచి దిగుబడులు పొందవచ్చు.
☛ తోటకూర: RNA-1, అర్కా సుగుణ, అర్కా అరుణిమ ఇవి ఎరుపు రకాలు. VARNA(VRA-I)
☛ పాలకూర: ఆల్ గ్రీన్, పూస జ్యోతి, అర్క అనుపమ, పూస పాలక్, జాబ్నర్ గ్రీన్
☛ గోంగూర: ANGRAU-12, ఎర్ర గోంగూర రకాలు: AMV-4, AMV-5, AMV-7
☛ మెంతికూర: పూస ఎర్లి బంచింగ, లామ్ సెలక్షన్-1, లామ్ మెంతి-2, లామ్ సోనాలి.

News November 26, 2025

సౌతాఫ్రికాతో టెస్ట్.. భారత్ 4 వికెట్లు డౌన్

image

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో IND ఓటమి దిశగా పయనిస్తోంది. 27/2 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన IND మరో 2 వికెట్లు కోల్పోయింది. నైట్ వాచ్‌మన్ కుల్దీప్(5) బౌల్డ్ కాగా, ఆ తర్వాత వచ్చిన జురెల్(2) ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. దీంతో భారత్ 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అంతకుముందు సాయి సుదర్శన్ కూడా ఔట్ కాగా నోబాల్ కావడంతో బతికిపోయాడు.

News November 26, 2025

ఆనంద నిలయం విశేషాలివే..

image

శ్రీవారి దర్శనంతో భక్తులకు అంతులేని ఆనందాన్ని ఇచ్చేదే ‘ఆనంద నిలయం’. ఇది ఆదిశేషుని పడగ మీద ఉన్న ఆనంద పర్వతంపై ఉంటుంది. ఆ కారణంగానే దీనికి ఆనంద నిలయం అనే పేరు వచ్చిందని ఐతిహ్యం. తొండమాను చక్రవర్తి నిర్మించిన ఈ నిలయానికి పల్లవ రాజు విజయదంతి విక్రమ వర్మ బంగారు పూతను, వీరనరసింగదేవ యాదవరాయలు తులాభారం ద్వారా బంగారు మలామాను చేయించారు. శ్రీనివాసుడు శిలగా మారింది ఈ ఆనంద నిలయంలోనే. <<-se>>#VINAROBHAGYAMU<<>>