News September 19, 2024

మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్

image

UPలోని బృందావన్ రోడ్ స్టేషన్ సమీపంలో బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్సు రైలు పట్టాలు తప్పింది. 20 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనతో ఢిల్లీ-మథుర మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యుద్ధప్రాతిపదికన ఆ రూట్‌ను క్లియర్ చేసేందుకు రైల్వే సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇటీవలకాలంలో దేశంలో వరుస రైలు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి.

Similar News

News November 25, 2025

రేపే ఎన్నికల షెడ్యూల్!

image

TG: గ్రామాల్లో ఎన్నికల నగరా మోగనుంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి రిజర్వేషన్ల జాబితా అందడంతో రేపు సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు SEC సిద్ధమైనట్లు సమాచారం. బుధవారం కుదరకపోతే ఎల్లుండి తప్పనిసరిగా షెడ్యూల్ రిలీజ్ చేయనుంది. షెడ్యూల్, నోటిఫికేషన్, ఎన్నికల తేదీలపై ఇవాళ క్యాబినెట్ భేటీలో సీఎం రేవంత్ సర్కార్ తుది నిర్ణయం తీసుకోనుంది. అనంతరం వీటిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

News November 25, 2025

అధిక సాంద్రత పత్తిసాగు వల్ల ప్రయోజనాలేంటి?

image

ఒకేసారి పూత, కాయలు రావడం వల్ల పంట తొందరగా చేతికి వస్తుంది. గులాబి రంగు పురుగు తాకిడి తగ్గుతుంది. పంట కాలం త్వరగా పూర్తవ్వడం వల్ల నీటి వసతి ఉంటే రెండో పంటగా ఆరుతడి పంటలను సాగు చేసుకోవచ్చు. దీని వల్ల అదనపు ఆదాయం వస్తుంది. కూలీలు కూడా త్వరగా పత్తి ఏరవచ్చు. ఈ పద్ధతిలో ఎకరాకు సుమారు 30-40% అధిక దిగుబడికి ఛాన్సుంది. దీనికి తక్కువ కాలపరిమితి, భూమికి అనువైన రకాలను, హైబ్రిడ్ విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.

News November 25, 2025

సంతానాన్ని ప్రాప్తించే ‘సుబ్రహ్మణ్య షష్ఠి’

image

‘సుబ్రహ్మణ్య షష్ఠి’ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి ఆలయాల్లో రేపు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ శుభ దినాన కుమారస్వామిని దర్శించుకుంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్మకం. ఈ పండుగ రోజున స్కందోత్పత్తి కథ వింటే పెళ్లికాని వారికి త్వరగా వివాహం జరుగుతుందని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ☞ సుబ్రహ్మణ్య షష్ఠి పూజా సమయం, స్కందోత్పత్తి కథ కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>> క్లిక్ చేయండి.